ETV Bharat / state

పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ - గుంటూరుకి తరలింపు - GORANTLA MADHAV POLICE CUSTODY

రెండు రోజుల కస్టడీ నిమిత్తం అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు - రాజమండ్రి సెంట్రల్ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరుకి తరలింపు

Guntur Police Taken Two Days Custody To Gorantla Madhav
Guntur Police Taken Two Days Custody To Gorantla Madhav (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 23, 2025 at 8:45 PM IST

2 Min Read

Guntur Police Taken Two Days Custody To Gorantla Madhav : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ను గుంటూరు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ పై దాడి యత్నం, పోలీసుల విధులకు ఆటంకం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్​ను మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు పోలీసులు కస్టడీ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. నాలుగు గంటల సమయంలో నగరానికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత గుంటూరు జీజీహెచ్​లో మాధవ్​కు వైద్య పరీక్షలు చేయించారు.

వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు స్టేషన్​కు తీసుకెళ్లారు. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గోరంట్ల మాధవ్​ను రెండు రోజులు విచారించనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో మాధవ్​ను పోలీసులు హాజరుపర్చాలి. అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చినా అధికారులు అలసత్వం కారణంగా విచారణ సమయాన్నిసద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసు అధికారుల అలసత్వం : బుధవారం ఉదయమే కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నా మధ్యాహ్నం 12 గంటల వరకు గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వైద్య పరీక్షలు నిర్వహించి నల్లపాడు పోలీస్ స్టేషన్​కు తరలించే సరికి సాయంత్రం 5 గంటలైంది. దీంతో గురువారం మధ్యాహ్నం వరకు మాత్రమే పోలీసుల కస్టడీలో మాధవ్​ను అధికారులు విచారించనున్నారు.

11 మందిపై వేటుపడినా మారలేదు : కనీసం 24 గంటలు కూడా మాధవ్​ను విచారించే అవకాశం ఉండకపోవడంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఎలా సంపాదిస్తారనే ప్రశ్నలు పోలీసులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పటికే గోరంట్ల మాధవ్​ను జీజీహెచ్, కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఆలసత్వం చూపడంతో 11 మంది పోలీసు అధికారుల పై వేటు పడినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం చర్చానీయాంశమైంది.

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత : అయితే పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్‌ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు మాధవ్‌ను గుంటూరు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మాధవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

గోరంట్ల మాధవ్‌ ఎఫెక్ట్ - 11 మంది పోలీసులు సస్పెండ్

పోలీసు విధులకు ఆటంకం - గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Guntur Police Taken Two Days Custody To Gorantla Madhav : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ను గుంటూరు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ పై దాడి యత్నం, పోలీసుల విధులకు ఆటంకం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్​ను మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు పోలీసులు కస్టడీ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. నాలుగు గంటల సమయంలో నగరానికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత గుంటూరు జీజీహెచ్​లో మాధవ్​కు వైద్య పరీక్షలు చేయించారు.

వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు స్టేషన్​కు తీసుకెళ్లారు. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గోరంట్ల మాధవ్​ను రెండు రోజులు విచారించనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో మాధవ్​ను పోలీసులు హాజరుపర్చాలి. అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చినా అధికారులు అలసత్వం కారణంగా విచారణ సమయాన్నిసద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసు అధికారుల అలసత్వం : బుధవారం ఉదయమే కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నా మధ్యాహ్నం 12 గంటల వరకు గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వైద్య పరీక్షలు నిర్వహించి నల్లపాడు పోలీస్ స్టేషన్​కు తరలించే సరికి సాయంత్రం 5 గంటలైంది. దీంతో గురువారం మధ్యాహ్నం వరకు మాత్రమే పోలీసుల కస్టడీలో మాధవ్​ను అధికారులు విచారించనున్నారు.

11 మందిపై వేటుపడినా మారలేదు : కనీసం 24 గంటలు కూడా మాధవ్​ను విచారించే అవకాశం ఉండకపోవడంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఎలా సంపాదిస్తారనే ప్రశ్నలు పోలీసులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పటికే గోరంట్ల మాధవ్​ను జీజీహెచ్, కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఆలసత్వం చూపడంతో 11 మంది పోలీసు అధికారుల పై వేటు పడినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం చర్చానీయాంశమైంది.

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత : అయితే పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్‌ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు మాధవ్‌ను గుంటూరు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మాధవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

గోరంట్ల మాధవ్‌ ఎఫెక్ట్ - 11 మంది పోలీసులు సస్పెండ్

పోలీసు విధులకు ఆటంకం - గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.