ETV Bharat / state

ఇంటి కొలతలు తప్పుగా చూపించి ట్యాక్స్ కడుతున్నారా? - మీకోసం నోటీసులు రెడీ అవుతున్నాయి! - GHMC NOTICES PROPERTYTAX DEFAULTERS

జీఐఎస్‌ సర్వేతో నిర్మాణాలను జల్లెడ పడుతున్న జీహెచ్‌ఎంసీ - 80 వేల నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తిపన్నులో తేడాలు ఉన్నట్లు గుర్తింపు - జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 213 కింద నోటీసులు జారీకి సన్నాహాలు

Greater Hyderabad Municipal Corporation
GHMC notices Property Tax Defaulters (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 9, 2025 at 12:53 PM IST

2 Min Read

GHMC notices Property Tax Defaulters in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని నిర్మాణాలు, తక్కువ కడుతున్న భవనాల వివరాలు జీఐఎస్‌(జియోగ్రాఫిక్​ ఇన్​ఫర్మేషన్ సిస్టం) సర్వేలో లెక్క తేలుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం మేరకు సర్వే పూర్తవగా అందులో ఏకంగా 80 వేల నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తిపన్నులో తేడాలు ఉన్నట్లు సంబంధిత సర్వేయర్లు గుర్తించారు.

సెక్షన్‌ 213 ప్రకారం నోటీసులు : అందులో పూర్తిగా పన్ను కట్టని నిర్మాణాలే 20 వేల వరకు ఉన్నాయి. బల్దియా ఐటీ(ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగం ఆయా నిర్మాణాల జాబితాను ఇటీవల జీహెచ్​ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తికి అందజేశారు. ఆ భవనాలన్నింటికీ చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని, యజమానుల నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్​ఎంసీ జోనల్‌ కమిషనర్లు చర్యలు ప్రారంభించారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 213 ప్రకారం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయిదు లక్షలకు పైగా భవనాలకు: జీఐఎస్‌ సర్వే ఏడాది కిందట అప్పటి జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో మొదలైంది. డ్రోన్‌తో హైదరాబాద్​ నగరాన్ని చిత్రీకరించారు. జీయోగ్రాఫికల్ మ్యాప్​ను రూపొందించారు. ప్రస్తుతం ఇంటింటి సర్వే జరుగుతోంది. పూర్తయిన 20 శాతం ఇంటింటి సర్వేలో దాదాపు 80 వేల భవనాలు లెక్క తేలాయి. నగరం మొత్తాన్ని సర్వే చేస్తే 5 లక్షలకు పైగా భవనాలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నోటీసులిస్తూనే : సర్వేయర్లు గుర్తిస్తున్న సమాచారంలో కూడా లోపాలు ఉండొచ్చనే కారణంతో గుర్తించిన ప్రతి ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలని, ఆ వివరాలను సంబంధిత సహాయ మున్సిపల్‌ కమిషనర్‌(ఏఎంసీ) ఆన్‌లైన్‌లోనూ అప్​లోడ్​ చేయాలని కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. నోటీసుకు 15 రోజుల్లోపు యజమాని వివరణ ఇవ్వాలని చెబుతున్నారు.

పౌరుల అభ్యంతరాలకు : యజమాని ఇచ్చే వివరణ ఆధారంగా సంబంధిత బిల్‌ కలెక్టర్‌ లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి డిప్యూటీ కమిషనర్​కు నివేదికను సమర్పిస్తారు. స్పందించకపోతే మాత్రం విచారణ లేకుండానే పన్ను మదింపు జరిగిపోతుంది. నోటీసులపై పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి కోసం సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ ఆ యజమాని అభ్యంతరాలపై విచారణ జరపాలని సూచించారు. నోటీసు జారీ, దాని వివరాలను యజమాని ఫోన్‌ నంబరుకు మెసేజ్ ద్వారా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం - ఆస్తి పన్ను కడితేనే వాటి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను చెల్లింపు - అలా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ

GHMC notices Property Tax Defaulters in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని నిర్మాణాలు, తక్కువ కడుతున్న భవనాల వివరాలు జీఐఎస్‌(జియోగ్రాఫిక్​ ఇన్​ఫర్మేషన్ సిస్టం) సర్వేలో లెక్క తేలుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం మేరకు సర్వే పూర్తవగా అందులో ఏకంగా 80 వేల నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తిపన్నులో తేడాలు ఉన్నట్లు సంబంధిత సర్వేయర్లు గుర్తించారు.

సెక్షన్‌ 213 ప్రకారం నోటీసులు : అందులో పూర్తిగా పన్ను కట్టని నిర్మాణాలే 20 వేల వరకు ఉన్నాయి. బల్దియా ఐటీ(ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగం ఆయా నిర్మాణాల జాబితాను ఇటీవల జీహెచ్​ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తికి అందజేశారు. ఆ భవనాలన్నింటికీ చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని, యజమానుల నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్​ఎంసీ జోనల్‌ కమిషనర్లు చర్యలు ప్రారంభించారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 213 ప్రకారం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయిదు లక్షలకు పైగా భవనాలకు: జీఐఎస్‌ సర్వే ఏడాది కిందట అప్పటి జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో మొదలైంది. డ్రోన్‌తో హైదరాబాద్​ నగరాన్ని చిత్రీకరించారు. జీయోగ్రాఫికల్ మ్యాప్​ను రూపొందించారు. ప్రస్తుతం ఇంటింటి సర్వే జరుగుతోంది. పూర్తయిన 20 శాతం ఇంటింటి సర్వేలో దాదాపు 80 వేల భవనాలు లెక్క తేలాయి. నగరం మొత్తాన్ని సర్వే చేస్తే 5 లక్షలకు పైగా భవనాలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నోటీసులిస్తూనే : సర్వేయర్లు గుర్తిస్తున్న సమాచారంలో కూడా లోపాలు ఉండొచ్చనే కారణంతో గుర్తించిన ప్రతి ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలని, ఆ వివరాలను సంబంధిత సహాయ మున్సిపల్‌ కమిషనర్‌(ఏఎంసీ) ఆన్‌లైన్‌లోనూ అప్​లోడ్​ చేయాలని కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. నోటీసుకు 15 రోజుల్లోపు యజమాని వివరణ ఇవ్వాలని చెబుతున్నారు.

పౌరుల అభ్యంతరాలకు : యజమాని ఇచ్చే వివరణ ఆధారంగా సంబంధిత బిల్‌ కలెక్టర్‌ లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి డిప్యూటీ కమిషనర్​కు నివేదికను సమర్పిస్తారు. స్పందించకపోతే మాత్రం విచారణ లేకుండానే పన్ను మదింపు జరిగిపోతుంది. నోటీసులపై పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి కోసం సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ ఆ యజమాని అభ్యంతరాలపై విచారణ జరపాలని సూచించారు. నోటీసు జారీ, దాని వివరాలను యజమాని ఫోన్‌ నంబరుకు మెసేజ్ ద్వారా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం - ఆస్తి పన్ను కడితేనే వాటి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను చెల్లింపు - అలా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.