Food Safety Officials Raids on Juice Centers in Hyderabad : ఈ వేసవి కాలంలో చల్లబడటానికి రోడ్డు పక్కన పండ్ల రసాలతో తయారు చేసిన జ్యూస్ తాగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! హైదరాబాద్లోని జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనీఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పాడైపోయిన పండ్లతో జ్యూస్లు : జ్యూస్ సెంటర్లలో కుళ్లిన పండ్లను వినియోగిస్తూ జ్యూస్ అమ్మకాలు చేస్తున్నారు. ఫ్రిజ్లలో బొద్దింకలు ఉన్నా వాటినే వినియోగిస్తున్న తీరుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూస్ షాపుల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యం ఏమై పోయినా పర్వాలేదని పాడైపోయిన పండ్లతో జ్యూస్లు చేసి ప్రజలకు అమ్ముతున్నారు.

జరిమానా : అసలే వేసవి కావడంతో జ్యూసులు తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో జ్యూస్ షాప్ల నిర్వహకులు కనీస శుభ్రత పాటించడం లేదు. పండ్లపై ఈగలు, బొద్దింకలు ఉంటున్నాయి. పాడైపోయిన పండ్లతో జ్యూస్ చేసి అమ్మేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి తనిఖీ చేయడంతో వారి బాగోతం బయటపడింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్, ఎస్సార్ నగర్లోని పలు జ్యూస్ షాపుల యాజమాన్యానికి జరిమానా విధించారు.


కల్తీ ఫుడ్కు త్వరలోనే చరమగీతం! : రుచికరమైన వంటలకు హైదరాబాద్ చిరునామా. దేశ విదేశాల నుంచి ఎవరొచ్చినా బిర్యానీ, ఇతర వంటలు రుచి చూసి సంతోషంగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధాని కేంద్రంగా రుచితో పాటు శుచికరమైన ఆహారాన్ని హామీగా అందించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖతో కలిసి నగరంలో ఐదు కొత్త ఆహార పరీక్ష కేంద్రాలు నెలకొల్పేందుకు కమిషనర్ ఇలంబర్తి నిర్ణయించారు. జోనల్ కమిషనర్లు స్థలాలను గుర్తిస్తున్నారు. ఆయా కేంద్రాలు అందుబాటులోకి వస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు పెరగనున్నాయి.
జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం నుంచి పని చేస్తున్న ఆహార భద్రత విభాగాన్ని తాజాగా ఆరోగ్య శాఖ కమిషనర్ వికేంద్రీకరించారు. ఐదుగురు జోనల్ కమిషనర్లకు ఇన్ఛార్జి డిజిగ్నేటెడ్ అధికారి హోదాను కేటాయించి, ఆహార భద్రతాధికారులు వీరి కింద పని చేసేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. వారి ఆధ్వర్యంలో లైసెన్సుల జారీ, ఐదు కేంద్రాలు నిర్మించాలని కమిషనర్ లక్ష్యం నిర్దేశించారు. పూర్తి కథనం చదవడానికి ఈ లింక్పై క్లిక్ చేయండి