Fire Breaks Out in Private Travels Bus: విజయవాడ బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డుపై ఆపి ఉంచగా ఏసీ నుంచి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో మంటలు రావడంతో కృష్ణ లంక రహదారిపై వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులు బస్సు దిగిపోయారు.
బస్సుల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు - ఫైర్ సేఫ్టీ ఉంటేనే రిజిస్ట్రేషన్
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి