ETV Bharat / state

క్షిపణుల అభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా : సతీష్‌రెడ్డి - SATISH REDDY TAKES CHARGE ADVISOR

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సతీష్‌రెడ్డి - ఏపీఐఐసీ భవనంలో బాధ్యతలు స్వీకరించిన సతీష్‌రెడ్డి

Satish Reddy Takes Charge as Advisor
Satish Reddy Takes Charge as Advisor (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 24, 2025 at 8:55 PM IST

1 Min Read

Satish Reddy Takes Charge as Advisor : ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​కి గౌరవ సలహాదారుడిగా డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్​రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్​రెడ్డికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని ఎంపీ పేర్కొన్నారు.

తనను రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు సతీష్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణుల అభివృద్ధి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని సతీష్​రెడ్డి వివరించారు.

మరోవైపు సతీష్​రెడ్డి కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆయణ్ని కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్‌ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డీప్‌టెక్‌లో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇస్తారు.

చేనేత, హస్తకళల గౌరవ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుచిత్ర ఎల్ల

రాష్ట్రంలో క్షిపణి పరిశోధనా కేంద్రం - అవనిగడ్డ ఎమ్మెల్యే ఏమన్నారంటే!

Satish Reddy Takes Charge as Advisor : ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​కి గౌరవ సలహాదారుడిగా డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్​రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్​రెడ్డికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని ఎంపీ పేర్కొన్నారు.

తనను రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు సతీష్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణుల అభివృద్ధి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని సతీష్​రెడ్డి వివరించారు.

మరోవైపు సతీష్​రెడ్డి కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆయణ్ని కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్‌ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డీప్‌టెక్‌లో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇస్తారు.

చేనేత, హస్తకళల గౌరవ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుచిత్ర ఎల్ల

రాష్ట్రంలో క్షిపణి పరిశోధనా కేంద్రం - అవనిగడ్డ ఎమ్మెల్యే ఏమన్నారంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.