Development Programmes in Amaravati Villages : అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలను ఆధునికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు వాటిని స్మార్ట్గా తీర్చిదిద్దుతోంది. ఒక్కో వసతి కల్పిస్తూ రూపురేఖలు మారుస్తోంది.
అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (సీఐటీఐఐఎస్) ప్రాజెక్టు కింద రూ.138.62 కోట్లతో 14 పాఠశాలలు, 17 మోడల్ అంగన్వాడీలు, 16 ఈ-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. భవనాలన్నింటిపైనా సౌర ఫలకలను బిగించింది.



ఉగాది వేళ 'పీ-4' పండగ - ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
జంగిల్ క్లియరెన్స్ పనులు: అమరావతి పునర్నిర్మాణ పనులు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గతంలో చేపట్టిన రాజధాని నిర్మాణాల పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అమరావతిలో ఈ పనులకు 90 శాతం పైగా టెండర్ల ప్రక్రియ పూర్త చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు తాము పనులు చేయాల్సిన కట్టడాలు, రహదారులు, నిర్మాణాల వద్ద పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించే పనులు చేపట్టాయి. గుత్తేదారు సంస్థలు, కార్మికులు, ఉద్యోగుల కోసం వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి కార్మికులు రాజధానికి చేరుకొని సన్నాహక పనుల్లో నిమగ్నమయ్యారు.
ఎక్కడ ఎలా?: అనంతవరం వద్ద ఎన్-17 రహదారి, వెలగపూడి వద్ద ఎన్-9, రాయపూడి వద్ద కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, విభాగాధి పతులు, శాఖమూరు వద్ద హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ వద్ద డీవాటరింగ్ పనులు, కార్మికులకు షెడ్లు, వసతి సౌకర్యాల ఏర్పాట్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సీడ్యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి సీలింగ్, విద్యుత్తు, ఏసీలు, టైల్స్, అద్దాలు అమర్చే ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. శాఖమూరు వద్ద అంబేడ్కర్ పార్కు, నీరుకొండ వద్ద కొండవీటి వాగు ప్రాజెక్ట్, సీడ్యాక్సెస్ రహదారి పక్కన మొక్కలు నాటే పనులు చేపట్టారు. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లూ రాజధాని నిర్మాణ పనులు నిలిపి వేయడంతో రహదారులు, నిర్మాణాలు, కట్టడాల వద్ద పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో నిండి ఉన్నాయి. ఐఐటీ నిపుణులు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం అంచనాలు తయారు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారులను ఎంపిక చేసింది.
అమరావతితో సమానంగా గ్రామాల్లో అభివృద్ధి - రాజధాని రైతులతో సీఆర్డీఏ సమావేశం