ETV Bharat / state

పవన్ కల్యాణ్ గొప్ప మనసు - ఆ ఊరు మొత్తానికి చెప్పులు పంపిణీ - PAWAN SLIPPERS TO TRIBALS

అల్లూరి జిల్లా పర్యటనలో తనతో నడిచిన కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించిన పవన్‌ - కార్యాలయ సిబ్బందితో పెదపాడు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పాదరక్షలు పంపిణీ చేయించిన పవన్‌

Pawan Kalyan Team Slippers Distribution To Tribals
Pawan Kalyan Team Slippers Distribution To Tribals (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 9:22 AM IST

1 Min Read

Pawan Kalyan Team Slippers Distribution To Tribals : కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడుకు చెందినవారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7న 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటించిన విషయం తెలిసిందే.

చలించిపోయిన పవన్ : ఆ సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు పవన్‌కల్యాణ్‌ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆ వృద్ధురాలు చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్‌ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో మాట్లాడి గ్రామంలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీశారు. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. అందులో భాగంగానే గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపారు.

ప్రతి ఇల్లు తిరుగుతూ : ఈ చెప్పులను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్‌తోపాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. తమ కష్టం తెలుసుకొని స్వయంగా ఉప ముఖ్యమంత్రే చొరవ తీసుకొని పాదరక్షలు పంపిణీ చేయించిన పవన్‌కల్యాణ్‌కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

మాటిచ్చాను - గిరిజనులను కలిశాకే సింగపూర్​కు వెళ్తా: పవన్ కల్యాణ్

పవన్‌ కాన్వాయ్‌ వల్లే విద్యార్థులు పరీక్షకు వెళ్లలేకపోయారా - విశాఖ సీపీ ఏమన్నారంటే?

Pawan Kalyan Team Slippers Distribution To Tribals : కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడుకు చెందినవారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7న 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటించిన విషయం తెలిసిందే.

చలించిపోయిన పవన్ : ఆ సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు పవన్‌కల్యాణ్‌ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆ వృద్ధురాలు చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్‌ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో మాట్లాడి గ్రామంలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీశారు. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. అందులో భాగంగానే గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపారు.

ప్రతి ఇల్లు తిరుగుతూ : ఈ చెప్పులను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్‌తోపాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. తమ కష్టం తెలుసుకొని స్వయంగా ఉప ముఖ్యమంత్రే చొరవ తీసుకొని పాదరక్షలు పంపిణీ చేయించిన పవన్‌కల్యాణ్‌కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

మాటిచ్చాను - గిరిజనులను కలిశాకే సింగపూర్​కు వెళ్తా: పవన్ కల్యాణ్

పవన్‌ కాన్వాయ్‌ వల్లే విద్యార్థులు పరీక్షకు వెళ్లలేకపోయారా - విశాఖ సీపీ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.