Cygni Energy Launches BESS Gigafactory : హైదరాబాద్ కేంద్రంగా పని చేసే సిగ్ని ఎనర్జీ సంస్థ ఆటోమేటెడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) గిగా ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభించినట్లుగా ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలోని మహేశ్వరంలో గల ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వద్ద ఉన్న ఈ-మొబిలిటీ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేశారు. అధునాతన ఇంజినీరింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్ ల్యాబ్తో కూడిన వ్యవస్థ ఇక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎంవో ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈవో జయేశ్ రంజన్ బుధవారం ఐఐటీ ఛైర్మన్, ఐల్యాబ్స్ గ్రూప్స్ వ్యవస్థాపకుడు శ్రీనిరాజులతో కలిసి ఫేజ్-1ను ప్రారంభించారు.
నైపుణ్యం, ఆవిష్కరణల వైపు ఓ గొప్ప ముందడుగు : ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, సిగ్ని బీఈఈఎస్ ఏర్పాటు చేసి తన మొదటి మైలురాయిని అధిగమించినందుకు ప్రశంసించారు. రాష్ట్రంలో సిగ్ని బ్యాటరీ తయారీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభమనేది తయారీ, నైపుణ్యం, ఆవిష్కరణల వైపు ఒక పరవర్తనాత్మక అడుగును సూచిస్తుందన్నారు. దీనివల్ల నూతన ఉద్యోగాల కల్పన, స్థానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఎనర్జీ స్టోరేజ్ ఆవిష్కరణల్లో ఒక మంచి ఒరవడికి దోహదపడుతుందన్నారు.

ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉంచుతుంది : అనంతరం సిగ్ని వ్యవస్థాపకులు, సంస్థ సీఈవో వెంకట్ రాజారామన్ మాట్లాడుతూ ఈ గిగాఫ్యాక్టరీ అనేది ఎనర్జీ, శక్తి నిల్వ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందన్నారు. సిగ్ని సంస్థ ఆటోమేటెడ్ బీఈఈఎస్ అధునాతన అసెంబ్లీ లైన్, అధిక నాణ్యతతో కూడిన బీఈఈఎస్ మాడ్యుల్ తయారీ కోసం రూపొందించినట్లుగా వివరించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులను ఉపయోగించుకుంటుందని తెలిపారు. భవిష్యత్లో దేశీయంగా, అంతర్జాతీయంగా ఇంధన నిల్వ రంగంలో మరింత వృద్ధి చెందాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
వేలల్లో ఉద్యోగవకాశాల కల్పనకు : రెండు దశల్లో మొత్తం రూ.250 కోట్ల పెట్టుబడితో ఇది రాబోయే రెండేళ్లలో సుమారు 1000 మందికి మించి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందన్నారు. ఈ విస్తరణలో భాగంగా ఇ-మొబిలిటి పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు ప్రస్తుత లైన్లకు మూడు అదనపు ఆటోమెటెడ్ 2జీడబ్ల్యూహెచ్ సెల్-టు-ప్యాక్ తయారీ లైన్లు, కంటైనర్ ఇంటిగ్రేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
సిగ్ని సంస్థ గురించి : హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థను 2014లో స్థాపించారు. ఎనర్జీ స్టోరేజ్, ఇంజినీరింగ్కు సంబంధించిన సంస్థ ఇది. మేకిన్ ఇండియా కింద గుర్తింపు పొందిన మొదటి కంపెనీగా గుర్తింపు పొందింది. సిగ్ని వ్యవస్థాపకులు అటల్ ఇన్నెవేషన్ మిషన్లో గుర్తింపు పొందిన మెంటార్ కూడా. సిగ్ని సంస్థ ఆటోమోటివ్ రంగంలో అత్యున్నత స్థాయి నాణ్యత ధ్రువీకరణల్లో ఒకటైన ఐఏటీఎఫ్ 16949 సర్టిఫికెట్ను కూడా కలిగి్ ఉంది.
హైదరాబాద్కు మరో భారీ పెట్టుబడి - 10,500కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న జపాన్ కంపెనీలు