ETV Bharat / state

కేశినేని సోదరుల మధ్య మళ్లీ వివాదం - సోషల్ మీడియా వేదికగా వార్ - FIGHT BETWEEN KESINENI BROTHERS

ఎంపీ కేశినేని శివనాథ్ పై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని - గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్

Kesineni Brothers  Social Media War
Kesineni Brothers Social Media War (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 23, 2025 at 7:59 PM IST

1 Min Read

Kesineni Brothers Social Media War : విజయవాడలో కేశినేని సోదరుల మధ్య వివాదం సోషల్ మీడియా వేదికగా ముదురుతోంది. మాజీ ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(కేశినేని చిన్ని) పై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు భూములు ఇచ్చిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చిన్ని బినామీ కంపెనీ అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా నాని ఆరోపణలు గుప్పించారు.

దీన్ని ఆ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా ఖండించి రాజకీయ దురుద్దేశంతో పెట్టుబడులు అడ్డుకుంటున్నారంటూ వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్ పేరిట కార్యాలయం ఏర్పాటు చేసి కేశినేని చిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కేశినేని నాని మరో పోస్టు పెట్టారు.

దీనికి ఎంపీ కేశినేని చిన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్ల మీద మతిభ్రమించి తిరుగుతున్న సైకో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కసి, పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న వారి పట్ల స్పందించాల్సి అవసరం లేదని స్పష్టం చేస్తూ పోస్టు చేశారు.

Kesineni Brothers Social Media War : విజయవాడలో కేశినేని సోదరుల మధ్య వివాదం సోషల్ మీడియా వేదికగా ముదురుతోంది. మాజీ ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(కేశినేని చిన్ని) పై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు భూములు ఇచ్చిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చిన్ని బినామీ కంపెనీ అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా నాని ఆరోపణలు గుప్పించారు.

దీన్ని ఆ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా ఖండించి రాజకీయ దురుద్దేశంతో పెట్టుబడులు అడ్డుకుంటున్నారంటూ వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్ పేరిట కార్యాలయం ఏర్పాటు చేసి కేశినేని చిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కేశినేని నాని మరో పోస్టు పెట్టారు.

దీనికి ఎంపీ కేశినేని చిన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్ల మీద మతిభ్రమించి తిరుగుతున్న సైకో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కసి, పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న వారి పట్ల స్పందించాల్సి అవసరం లేదని స్పష్టం చేస్తూ పోస్టు చేశారు.

అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం - జైషా అనుమతి: కేశినేని చిన్ని

ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు - ఆటోనగర్ రోడ్లను పరిశీలించిన ఎంపీ కేశినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.