ETV Bharat / state

పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - బయటపడ్డ ఉపాధ్యాయుల బాగోతం

తరగతుల్లో విధులు నిర్వహించకుండా ఉపాధ్యాయులు డుమ్మా, సరిగా లేని వార్డెన్ నిర్వహణ - వార్డెన్‌ను సస్పెండ్‌ చేసి, ముగ్గురు టీచర్లకు షోకాస్‌ నోటీసులిచ్చిన కలెక్టర్‌

Collector Takes Action on Warden And Teachers in Alluri District
Collector Takes Action on Warden And Teachers in Alluri District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 6, 2025 at 10:12 PM IST

1 Min Read
Choose ETV Bharat

Collector Takes Action on Warden And Teachers : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌, ఉపాధ్యాయులపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్న ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు మండలం డోకులూరు గిరిజన సంక్షేమ పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతుల్లో విధులు నిర్వహించకుండా ఉపాధ్యాయులు డుమ్మా కొట్టడం, వార్డెన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయట తిరుగుతుండటంతో అసహనానికి గురయ్యారు. వార్డెన్‌ను సస్పెండ్‌ చేసి ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాస్‌ నోటీసులిచ్చారు. తరచూ సెలవులు పెడుతున్న ఇంగ్లీష్​ను మెడికల్ బోర్డుకి రిఫర్ చేశారు. విద్యా బోధన సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

"ప్రిన్సిపాల్ వేధింపులు" - గురుకుల విద్యార్థుల 18 కి.మీ. పాదయాత్ర