ETV Bharat / state

మూసీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి - అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం - CM REVANTH REVIEW ON MUSI REVIVAL

మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష - ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశం

CM Revanth Reddy Review on Musi Revival
CM Revanth Reddy Review on Musi Revival (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 11, 2025 at 8:55 PM IST

2 Min Read

CM Revanth Reddy Review on Musi Revival : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మీర్ అలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి సంబంధించి కన్సల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ బ్రిడ్జితోపాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్‌లా ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ఐలాండ్ అభివృద్ధి : సింగపూర్‌లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండేలా కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలని సూచించారు. బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని ప్రస్తావించారు. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతోపాటు ఐలాండ్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం - పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యత, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రత ముందుగానే అంచనా వేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతోపాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన పూర్తి స్థాయి సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి : మీర్ అలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ అభివృద్ధి ప్రణాళికలు దృష్టిలో పెట్టుకొని జంతు ప్రదర్శనశాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే జూ అధికారులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, మూసీ రివర్​ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మూసీ పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు - ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

CM Revanth Reddy Review on Musi Revival : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మీర్ అలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి సంబంధించి కన్సల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ బ్రిడ్జితోపాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్‌లా ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ఐలాండ్ అభివృద్ధి : సింగపూర్‌లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండేలా కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలని సూచించారు. బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని ప్రస్తావించారు. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతోపాటు ఐలాండ్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం - పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యత, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రత ముందుగానే అంచనా వేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతోపాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన పూర్తి స్థాయి సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి : మీర్ అలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ అభివృద్ధి ప్రణాళికలు దృష్టిలో పెట్టుకొని జంతు ప్రదర్శనశాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే జూ అధికారులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, మూసీ రివర్​ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మూసీ పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు - ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.