CM Revanth on Caste Census : జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయాలన్న కేంద్ర నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నేడు చేసింది, రేపు దేశం అనుసరిస్తుందని రుజువైందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్కు ధన్యావాదాలు తెలుపుతూ సీఎం ఎక్స్లో ట్వీట్ చేశారు. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళన చేయడంతో దేశవ్యాప్తంగా పోరాటం చేసిందన్నారు. రాహుల్గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన విజన్ను పాలసీగా వచ్చేలా చేయడం గర్వకారణమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
ఓబీసీల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు అనుసరించేందుకు అంగీకరించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో మొదటిసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం ప్రస్తావించారు. రాహుల్ విజన్ మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినట్లు రేవంత్రెడ్డి వివరించారు.
Based on the vision and direction of
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
Shri @RahulGandhi Ji who first demanded a nation-wide Caste Census during his historic #BharatJodoYatra Telangana is the first State to conduct caste survey last year.
This was the first in Independent #India, the last one being in 1931 by… pic.twitter.com/7dNABdwqM7
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ : బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగిందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి కులగణన తెలంగాణలో చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వేలో బీసీలు 56.32 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. కులగణన నివేదిక ప్రకారం ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
కులగణన విషయంలో కాంగ్రెస్ దారిలోకి బీజేపీ రావడం సంతోషకరం : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్
కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతో పాటు కులగణన నిర్వహించనున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కాంగ్రెస్ విజయమేనని స్పష్టం చేశారు. కులగణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారన్న విషయం తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించినట్లు వివరించారు.
జనాభా లెక్కింపులో కులగణన- కేంద్రం కీలక నిర్ణయం
ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి