CM Chandrababu Release Mindset Shift Book: ఏ నాయకుడికీ లేనన్ని సంక్షోభాలు ఎదుర్కొని ప్రతి సవాల్ని అవకాశంగా మార్చుకున్నందునే తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగూరు శరణి రచించిన 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రముఖ సినీనటుడు చిరంజీవికి అందజేశారు.
రొటీన్గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలు, ప్రసంగాలకు భిన్నంగా దీన్ని నిర్వహించారు. పుస్తకావిష్కరణ ముగిశాక రచయిత శరణి చంద్రబాబు, చిరంజీవితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా పుస్తక రచయిత శరణిపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచనా విధానాల్ని మార్చుకోవడానికి ‘ద సీక్రెట్’ పుస్తకాన్ని చదవమని చెప్పేవాడినని, ఇకపై శరణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు.
మీరింకా చిన్న పిల్లలే అనుకునేవాడిని: నేను మా నాన్నతోపాటు మీ దగ్గరకు వచ్చి నా పుస్తకాన్ని ఆవిష్కరించమని కోరినప్పుడు మీకు కలిగిన భావనేంటి అని శరణి అడిగిన ప్రశ్నకు మీరింకా తండ్రిచాటు బిడ్డలే అనుకునేవాడినని ఇంత పైకి వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయానని చంద్రబాబు అన్నారు. నేను 45 ఏళ్లపాటు ప్రాక్టీస్ చేసిన అంశాన్ని నువ్వు చిన్న వయసులోనే ఆచరించడమే కాకుండా, మైండ్సెట్ను కొద్దిగా మార్చుకుంటే ఏదైనా సాధించగలమని చెబుతూ అందరికీ ఉపయోగపడేలా పుస్తకమే రాశావని చంద్రబాబు కొనియాడారు.
నారాయణ స్థాపించిన విద్యాసంస్థలు ఒక బ్రాండ్ అని సాధారణ విద్యార్థుల్ని ఆయన దగ్గరకు పంపిస్తేనే మూడు నాలుగేళ్లలో మెరికల్లా మారుస్తారని అన్నారు. ఇక 24 గంటలూ ఇంట్లో ఉండే మిమ్మల్ని ఎలా వదులుతారని అన్నారు. ఆయన క్రమశిక్షణ, రుద్దుడు కార్యక్రమం ఇక్కడ రుద్దడం అంటే (నవ్వుతూ) పర్ఫెక్ట్గా తయారు చేయడ అని ఆయన అనుకున్నది సాధించేవరకు వదిలి పెట్టరని సీఎం పేర్కొన్నారు.
రెండేళ్లలో మంత్రినయ్యా: యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే రాజకీయ నాయకుడిని కావాలనుకున్నానని. వైస్ఛాన్స్లర్ పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తానన్నారు కాని వద్దని ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పానని తెలిపారు. మంత్రి కావాలనుకొని సీఎం చెన్నారెడ్డిని అడిగితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా అన్నట్టు చూశారని తనకు మెరిట్ ఉంటేనే ఇవ్వండని చెప్పి వచ్చేసినట్లు వివరించారు. అలా రెండేళ్లలో మంత్రినయ్యానని తెలిపారు. మనం ఒక అడుగు వేస్తే మరో అడుగు కలిసి వస్తుందని చంద్రబాబు తెలిపారు.
ప్రతికూల పరిస్థితులొచ్చినా అధిగమించారు - చంద్రబాబు మార్గదర్శకుడు: చిరంజీవి
సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ఈ స్థాయికి: చిరంజీవి సాధారణ కుటుంబం నుంచి వచ్చి సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ఈ స్థాయికి ఎదిగారని సీఎం కొనియాడారు. ఎన్టీఆర్ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చారని ఆయన విజయవాడలో చదవుకునేందుకు నాన్నమ్మతో కలసి ఇక్కడ ఒక గుడిసె వేసుకుని ఉండేవారని అన్నారు. ఒక రోజు గాలివాన వస్తే గుడిసె కూలిపోతే మరో దారి ఉండదని రాత్రంతా నిట్రాట పట్టుకుని కూర్చున్నారని తెలిపారు. ఈ విషయం ఆయనే చెప్పారని చెప్పారు. ఆయన రాజకీయాల్లో ఉన్నది 12 ఏళ్లే అయినా చరిత్ర సృష్టించారని కొనియాడురు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, అబ్దుల్కలాం వంటి వారంతా మైండ్సెట్తో గొప్పవాళ్లయినవారేనని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆలోచనే నాది ఆచరణ అధికారులదే: మీరు అధికారులకు ఏఐ, మెషీన్ లెర్నింగ్ వినియోగంపై సదస్సు నిర్వహిస్తున్నారు కదా అది ఎంత వరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో చాలా మంది పనిచేస్తుంటారు కదా వారి మైండ్సెట్ మార్చడానికి మీరు ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు మీ విద్యా సంస్థల్లో మీకు నచ్చిన ఫ్యాకల్టీని పెట్టుకుంటారు. కాని ప్రభుత్వంలో అలా కుదరదు. ఉన్న అధికారులతోనే పని చేయించుకోవాలి అనే ఆలోచనే నాది కాని ఆచరణ అధికారయంత్రాంగానిదే. మా అధికారులందరికీ ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు క్లాసులు పెట్టాము. ఇంక ఎకోసిస్టమ్ సృష్టిస్తే పోటీ వాతావరణం దానంతట అదే మొదలవుతుంది. అని సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు.
ఉగ్రవాదుల దాడిలో మృతి చెందినవారికి నివాళులులు: ప్రతి ఒక్కరూ ఓ ఆశయం, ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రొటీన్గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలు, ప్రసంగాలకు భిన్నంగా దీనిని నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండలో మృతి చెందినవారికి సభ నివాళులర్పించింది. చిరంజీవి ఉగ్రవాదుల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన సూచన మేరకు అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యలు ప్రతి పౌరుడూ ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశసమగ్రతకు ముప్పు తలపెట్టేవారిని అణచివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు.
ఆ అమ్మాయి సంకల్పం - తలవంచిన వైకల్యం - ఏకంగా ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్!
తొలిప్రయత్నంలో విఫలమైనా - పట్టుదలతో చదివా : పవన్కుమార్ రెడ్డి