ETV Bharat / state

నా జీవితం ప్రజలకే అంకితం : సీఎం చంద్రబాబు - CHANDRABABU ON P4 MODEL

సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తెచ్చాం - ఉగాది రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందన్న చంద్రబాబు

CBN_Comments_in_P4_Program
CBN_Comments_in_P4_Program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 30, 2025 at 9:34 PM IST

Updated : March 30, 2025 at 10:29 PM IST

2 Min Read

CM Chandrababu on P4 Model : ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది డబ్బుతో పరిష్కారమయ్యేది కాదని మనస్సు పెట్టి పనిచేసి సమస్యను పరిష్కరించేదని చెప్పారు. సాయాజీరావు చేసిన సాయం అంబేద్కర్ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడిందో మార్గదర్శిలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా కొందరు గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి వెనుకుండి దోహదపడిన వారు ఉన్నారని గుర్తుచేశారు. వెలగపూడిలోని నిర్వహించిన పీ-4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఎన్టీఆర్ లేకుంటే తానూ సాధారణే వ్యక్తిగానే ఉండేవాడినని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తన ఎదుగుదలకు ఆదర్శమని వెల్లడించారు. పీ-4 విధానం సరికొత్త చరిత్రకు శ్రీకారం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని పేదరికం లేని ఆంధ్రప్రదేశ్​గా మార్చేందుకే ఉగాది నాడు ఈ విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గత ఐదు దశాబ్ధాలుగా రాజకీయరంగంలో తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకే ఈ జీవితం అంకితం తప్ప వేరే ఆలోచనలు లేవని సీఎం స్పష్టంచేశారు.

నా జీవితం ప్రజలకే అంకితం : సీఎం చంద్రబాబు (ETV Bharat)

"రాష్ట్ర ప్రజలతో నా ప్రయాణం సాగించాలనుకుంటున్నాను. ప్రజాభిమానంతోనే నాకు కొత్త ఆలోచనలు, ఊపు వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు. భవిష్యత్​లోనూ చేయను. ప్రతీ రోజు ప్రజలకు ఏది మంచో ఆలోచించి పనిచేయడం తప్ప నాకు మరేం లేదు. పీ-4 విధానాన్ని ఆగస్టు 15నాటికి ఓ స్థాయికి తీసుకొచ్చి, వచ్చే ఉగాది నాటికి సత్ఫలితాలు ఆవిష్కరిస్తాంర. 2047 నాటికి రూ.55 లక్షల తలసరి ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి పీ-4 ఓ ఆయుధం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'ఇప్పటి వరకూ అనుకున్న ఏ ప్రణాళిక విఫలం కాలేదు. అలాగే పీ-4 కూడా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న 10 శాతం మంది నిరుపేదలుగా ఉన్న 20 శాతం మందితో కలిసి పనిచేయడమే ఈ విధానం. ప్రజల్ని ఆస్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. మట్టిలో మాణిక్యాల్ని అబ్ధుల్ కలాంల్లా తయారు చేద్దాం. బంగారు కుటుంబాల జీవితాల్లో మార్పు తెచ్చే వరకూ నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను' అని చంద్రబాబు స్పష్టంచేశారు.

AP Govt Launch P-4 Policy : రాష్ట్రాభివృద్ధి చేస్తూనే ప్రతీ పేదకుటుంబాన్ని పైకి తీసుకొచ్చి తీరుతామని చంద్రబాబు చెప్పారు. ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. పది నెలల్లోనే అమరావతి, పోలవరం పునర్నిర్మాణం చేపట్టడంతో పాటు విశాఖ ఉక్కు, రైల్వేజోన్ లాంటివి సాధించామని చెప్పారు. మూడు పార్టీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు. 90వ దశకంలో ఐటీ సంపద సృష్టించినట్లే, నేటి కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐలు సంపద సృష్టించే విధానాలని చంద్రబాబు వెల్లడించారు.

2047 నాటికి ప్రపంచంలో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలి: సీఎం చంద్రబాబు

P4 విధానం ప్రారంభం - విజన్ ఉన్న చంద్రబాబుకు అండగా ఉండాలన్న పవన్‌

CM Chandrababu on P4 Model : ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది డబ్బుతో పరిష్కారమయ్యేది కాదని మనస్సు పెట్టి పనిచేసి సమస్యను పరిష్కరించేదని చెప్పారు. సాయాజీరావు చేసిన సాయం అంబేద్కర్ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడిందో మార్గదర్శిలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా కొందరు గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి వెనుకుండి దోహదపడిన వారు ఉన్నారని గుర్తుచేశారు. వెలగపూడిలోని నిర్వహించిన పీ-4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఎన్టీఆర్ లేకుంటే తానూ సాధారణే వ్యక్తిగానే ఉండేవాడినని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తన ఎదుగుదలకు ఆదర్శమని వెల్లడించారు. పీ-4 విధానం సరికొత్త చరిత్రకు శ్రీకారం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని పేదరికం లేని ఆంధ్రప్రదేశ్​గా మార్చేందుకే ఉగాది నాడు ఈ విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గత ఐదు దశాబ్ధాలుగా రాజకీయరంగంలో తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకే ఈ జీవితం అంకితం తప్ప వేరే ఆలోచనలు లేవని సీఎం స్పష్టంచేశారు.

నా జీవితం ప్రజలకే అంకితం : సీఎం చంద్రబాబు (ETV Bharat)

"రాష్ట్ర ప్రజలతో నా ప్రయాణం సాగించాలనుకుంటున్నాను. ప్రజాభిమానంతోనే నాకు కొత్త ఆలోచనలు, ఊపు వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు. భవిష్యత్​లోనూ చేయను. ప్రతీ రోజు ప్రజలకు ఏది మంచో ఆలోచించి పనిచేయడం తప్ప నాకు మరేం లేదు. పీ-4 విధానాన్ని ఆగస్టు 15నాటికి ఓ స్థాయికి తీసుకొచ్చి, వచ్చే ఉగాది నాటికి సత్ఫలితాలు ఆవిష్కరిస్తాంర. 2047 నాటికి రూ.55 లక్షల తలసరి ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి పీ-4 ఓ ఆయుధం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'ఇప్పటి వరకూ అనుకున్న ఏ ప్రణాళిక విఫలం కాలేదు. అలాగే పీ-4 కూడా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న 10 శాతం మంది నిరుపేదలుగా ఉన్న 20 శాతం మందితో కలిసి పనిచేయడమే ఈ విధానం. ప్రజల్ని ఆస్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. మట్టిలో మాణిక్యాల్ని అబ్ధుల్ కలాంల్లా తయారు చేద్దాం. బంగారు కుటుంబాల జీవితాల్లో మార్పు తెచ్చే వరకూ నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను' అని చంద్రబాబు స్పష్టంచేశారు.

AP Govt Launch P-4 Policy : రాష్ట్రాభివృద్ధి చేస్తూనే ప్రతీ పేదకుటుంబాన్ని పైకి తీసుకొచ్చి తీరుతామని చంద్రబాబు చెప్పారు. ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. పది నెలల్లోనే అమరావతి, పోలవరం పునర్నిర్మాణం చేపట్టడంతో పాటు విశాఖ ఉక్కు, రైల్వేజోన్ లాంటివి సాధించామని చెప్పారు. మూడు పార్టీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు. 90వ దశకంలో ఐటీ సంపద సృష్టించినట్లే, నేటి కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐలు సంపద సృష్టించే విధానాలని చంద్రబాబు వెల్లడించారు.

2047 నాటికి ప్రపంచంలో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలి: సీఎం చంద్రబాబు

P4 విధానం ప్రారంభం - విజన్ ఉన్న చంద్రబాబుకు అండగా ఉండాలన్న పవన్‌

Last Updated : March 30, 2025 at 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.