ETV Bharat / state

ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం - ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం పిలుపు - CM CHANDRABABU ON SWACHH ANDHRA

స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర - ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపు

CHANDRABABU_ON_SWACHH_ANDHRA
CHANDRABABU_ON_SWACHH_ANDHRA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 8:48 PM IST

2 Min Read

CM Chandrababu on Swachh Andhra as part of Swarnandhra 2047: స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈసారి 'ఈ-వ్యర్థాల సేకరించి వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమ్'ను ఎంచుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం రోజు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్​ను ఎంచుకుని నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండని సూచించారు. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీ సభ్యులను గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ - వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం: గత 6 నెలలుగా స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్​తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రేపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి మంత్రి దిశా నిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు హాజరయ్యారు. రేపు ఇ- చెక్ అనే థీమ్​తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్​ను పూర్తిగా సేకరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

CM Chandrababu on Swachh Andhra as part of Swarnandhra 2047: స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈసారి 'ఈ-వ్యర్థాల సేకరించి వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమ్'ను ఎంచుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం రోజు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్​ను ఎంచుకుని నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండని సూచించారు. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీ సభ్యులను గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ - వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం: గత 6 నెలలుగా స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్​తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రేపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి మంత్రి దిశా నిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు హాజరయ్యారు. రేపు ఇ- చెక్ అనే థీమ్​తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్​ను పూర్తిగా సేకరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

వారి ఆనందానికి అవధులు లేవు - మెకానిక్ షెడ్డులో సీఎం చంద్రబాబు

అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన మళ్లీ ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.