ETV Bharat / state

మత్స్యకారుల జీవనప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తాం : సీఎం చంద్రబాబు - CHANDRABABU ON FISHERMEN WELFARE

బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - 1,29,178 కుటుంబాలకు రూ.20,000ల చొప్పున రూ.259 కోట్లు విడుదల

AP Matsyakara Bharosa
AP Matsyakara Bharosa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 5:45 PM IST

Updated : April 26, 2025 at 7:16 PM IST

3 Min Read

Matsyakara Bharosa in AP : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీయే ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 'మత్స్యకారుల సేవలో' పేరుతో మత్స్యకార భరోసా పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10,000ల నుంచి రూ.20,000లకు పెంచిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మొత్తం 1,29,178 కుటుంబాలకు రూ.20,000ల చొప్పున రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో చంద్రబాబు జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చంద్రబాబు బుడగట్లపాలెంలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం మత్స్యశాఖ స్టాళ్లు పరిశీలించిన ముఖ్యమంత్రి బుడగట్లపాలెంలో మత్స్యకారులతో మాట్లాడారు.

స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాత్రివేళ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తున్నారని చెప్పారు. కొందరు బోట్ల ద్వారా జాలర్ల సగం ఆదాయం కాజేస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జాలర్ల దశదిశ మారిందన్నారు. మత్స్యకార గ్రామాలు ఒకే మాటపై ఉండి కట్టడిగా ఉంటారని వివరించారు. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.

"మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఎన్డీయే మీ వెంటే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. గతంలో తీసుకువచ్చిన రుణాలతో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ సమస్యలు పరిష్కరిస్తాం. హైదరాబాద్‌ వెళ్లినా, దిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువగా పనిచేసేవారు శ్రీకాకుళం వారే ఉంటారు. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'శ్రీకాకుళం జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవ లేదు. అన్ని వనరులు ఉన్నా ఈ జిల్లా వెనుకబడి ఉంది. నదులు, సముద్ర తీరం, గనులు, హైవేలు ఎక్కువున్నాయి. జిల్లాను బాగుచేసే వరకు మళ్లీ మళ్లీ వస్తా. మీకు అండగా ఉంటా. నేను కూడా బటన్‌ నొక్కవచ్చు. మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి.. ప్రజల ఆదాయం పెంచాలి. వారి జీవనప్రమాణాలను సర్కార్ మెరుగుపర్చాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Matsyakara Sevalo in AP : గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారని చంద్రబాబు గుర్తుచేశారు. రామ్మోహన్‌ ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు. వారసత్వంగా వచ్చిన పనులే చేస్తూ పేదరికంలోనే బతకాలా అని అక్కడి వారిని ప్రశ్నించారు. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ముందుకెళ్లాలని చెప్పారు. 555 మత్స్యకార గ్రామాలున్నా మీ గ్రామానికే వచ్చానని అన్నారు. మీ గ్రామం దశదిశ మార్చాలని కష్టసుఖాలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రానికి సందేశం ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలను బాగు చేస్తాం. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం ఏపీ నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్​ నుంచి 32 శాతం మత్స్యసంపద ఎగుమతులు జరుగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప మరో మార్గం లేదు. మత్స్యకారుల పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు. మత్స్యకారుల జీవనప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తాం. రూ.1,990 కోట్లతో 9 షిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది. టీడీపీ సర్కార్ ఉండి ఉంటే రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగి ఉండేది. విశాఖ ప్రజల తలసరి ఆదాయం ఏపీలోనే అగ్రస్థానంలో ఉంది' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల తలసరి ఆదాయం పెరగాలని చంద్రబాబు వివరించారు. అందరూ సమానంగా ముందుకెళ్లాలని చెప్పారు. బుడగట్లపాలెంలో ఇళ్లు లేని 18 మందికి 6 నెలల్లో ఏర్పాటు చేస్తామనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని ప్రజల ఆదాయం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలి : సీఎం చంద్రబాబు

అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన మళ్లీ ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు

Matsyakara Bharosa in AP : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీయే ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 'మత్స్యకారుల సేవలో' పేరుతో మత్స్యకార భరోసా పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10,000ల నుంచి రూ.20,000లకు పెంచిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మొత్తం 1,29,178 కుటుంబాలకు రూ.20,000ల చొప్పున రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో చంద్రబాబు జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చంద్రబాబు బుడగట్లపాలెంలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం మత్స్యశాఖ స్టాళ్లు పరిశీలించిన ముఖ్యమంత్రి బుడగట్లపాలెంలో మత్స్యకారులతో మాట్లాడారు.

స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాత్రివేళ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తున్నారని చెప్పారు. కొందరు బోట్ల ద్వారా జాలర్ల సగం ఆదాయం కాజేస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జాలర్ల దశదిశ మారిందన్నారు. మత్స్యకార గ్రామాలు ఒకే మాటపై ఉండి కట్టడిగా ఉంటారని వివరించారు. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.

"మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఎన్డీయే మీ వెంటే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. గతంలో తీసుకువచ్చిన రుణాలతో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ సమస్యలు పరిష్కరిస్తాం. హైదరాబాద్‌ వెళ్లినా, దిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువగా పనిచేసేవారు శ్రీకాకుళం వారే ఉంటారు. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'శ్రీకాకుళం జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవ లేదు. అన్ని వనరులు ఉన్నా ఈ జిల్లా వెనుకబడి ఉంది. నదులు, సముద్ర తీరం, గనులు, హైవేలు ఎక్కువున్నాయి. జిల్లాను బాగుచేసే వరకు మళ్లీ మళ్లీ వస్తా. మీకు అండగా ఉంటా. నేను కూడా బటన్‌ నొక్కవచ్చు. మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి.. ప్రజల ఆదాయం పెంచాలి. వారి జీవనప్రమాణాలను సర్కార్ మెరుగుపర్చాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Matsyakara Sevalo in AP : గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారని చంద్రబాబు గుర్తుచేశారు. రామ్మోహన్‌ ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు. వారసత్వంగా వచ్చిన పనులే చేస్తూ పేదరికంలోనే బతకాలా అని అక్కడి వారిని ప్రశ్నించారు. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ముందుకెళ్లాలని చెప్పారు. 555 మత్స్యకార గ్రామాలున్నా మీ గ్రామానికే వచ్చానని అన్నారు. మీ గ్రామం దశదిశ మార్చాలని కష్టసుఖాలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రానికి సందేశం ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలను బాగు చేస్తాం. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం ఏపీ నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్​ నుంచి 32 శాతం మత్స్యసంపద ఎగుమతులు జరుగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప మరో మార్గం లేదు. మత్స్యకారుల పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు. మత్స్యకారుల జీవనప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తాం. రూ.1,990 కోట్లతో 9 షిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది. టీడీపీ సర్కార్ ఉండి ఉంటే రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగి ఉండేది. విశాఖ ప్రజల తలసరి ఆదాయం ఏపీలోనే అగ్రస్థానంలో ఉంది' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల తలసరి ఆదాయం పెరగాలని చంద్రబాబు వివరించారు. అందరూ సమానంగా ముందుకెళ్లాలని చెప్పారు. బుడగట్లపాలెంలో ఇళ్లు లేని 18 మందికి 6 నెలల్లో ఏర్పాటు చేస్తామనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని ప్రజల ఆదాయం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలి : సీఎం చంద్రబాబు

అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన మళ్లీ ప్రారంభిస్తా: సీఎం చంద్రబాబు

Last Updated : April 26, 2025 at 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.