Christians Observed Good Friday Across AP: గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు సిలువయాత్ర కార్యక్రమం చేపట్టారు. విషాద గీతాలు ఆలపిస్తూ పురవీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్రైస్తవులు సిలువమార్గం ప్రదర్శన నిర్వహించారు.పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైలవరంలో వందలాదిగా క్రైస్తవులు శిలువను మోస్తూ సిలువ మార్గ కార్యక్రమాన్ని స్థానిక ఆర్సీఎం చర్చ్ నుంచి నిర్వహించారు. మైలవరం కతోలిక విచారణ పరిధిలోని 16 సంఘాల విశ్వాసులు వందలాది మందితో 20 అడుగుల సిలువను మోస్తూ భక్తి శ్రద్దలతో మైలవరం పురవీదుల్లో ఊరేగింపు నిర్వహించారు.
బహిరంగ సిలువ మార్గం: విశాఖలోని ప్రముఖ చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పార్వతీపురంలో ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పవిత్ర శుక్రవారం కార్యక్రమాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో అశ్వరావుపేట రోడ్డులోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఏలూరు రోడ్లోని ఆర్సీఎం చర్చి వరకు బహిరంగ సిలువ మార్గం నిర్వహించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్లరేవు మండలాలలో క్రైస్తవులు క్రీస్తు సిలువతో ప్రదర్శన చేశారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో సిలువయాత్ర నిర్వహించారు.
గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ ప్రాముఖ్యత ఇదే!
శిలువ మోస్తూ ప్రదర్శన: కడప జిల్లాలో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మైదుకూరు సీఎస్ఐ ప్రార్థన మందిరానికి చెందిన భక్తులు ఏసు శిలువను మోస్తూ ప్రదర్శన చేపట్టారు. కమలాపురం సీఎస్ఐ చర్చి పరిధిలో క్రైస్తవులు శిలువ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో క్రైస్తవులు 14 ఘట్టాలకు సంబంధించిన ప్రార్థనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో గుడ్ ఫ్రైడే క్రైస్తవులు నిర్వహించారు. నగరంలోని సుబేదారుపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో బిషప్ ఎండి ప్రకాశం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం సంతపేట వీధుల్లో సిలువ మోసి, గుడ్ ఫ్రైడే విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.
కర్నూలులో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోల్స్ సెంటీనియల్ చర్చ్ అధ్యక్షుడు ఏడీఏ లింకన్ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. అంధకారమైన లోకాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు ఏసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి 3 రోజుల తర్వాత తిరిగి లోకంలోకి వస్తారని తెలిపారు.
పాస్టర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త - గౌరవ వేతనానికి రూ.30 కోట్లు రిలీజ్
స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్ట్గా పాఠాల్లో చేర్చుతాం : హోంమంత్రి అనిత