CM Revanth Reddy Review on Bhu Bharathi Portal : తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా మూడు మండలాల్లో అమలుచేయనున్న భూభారతి పోర్టల్పై అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ సోమవారం జాతికి అంకితమివ్వనున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుందని ఆకాంక్షించారు.
అత్యాధునికంగా భూభారతి : అత్యాధునికంగా భూభారతి వెబ్సైట్ ఉండాలని, భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి నిర్వహణను మంచి విశ్వసనీయత కల్గిన సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, సీఎం ఓఎస్డీ, రెవెన్యూశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
ఎన్నికలకు భూభారతి రెఫరెండం : సోమవారం రోజున ముందుగా 3 మండలాల్లో పైలట్గా భూభారతి అమలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి అమలవుతుందని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలకు భూభారతి రిఫరెండం అవుతుందని అన్నారు. మే నెల మొదటివారంలో గ్రామపరిపాలనాధికారుల నియామకం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
వారికే ఇళ్లు కేటాయించండి - ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు