Five Held in Child Trafficking Case : నగరంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన కేసును పోలీసులు చేధించారు. బాలికను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఐదుగురు నిందుతులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతి లాల్ పాటిల్ వివరించారు.
పోలీసుల కథనం ప్రకారం : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 20వ తేదీన చాంద్రాయణగుట్టలోని గాంధీ విగ్రహం సమీపంలో నుంచి 5 ఏళ్ల బాలికను ద్విచక్ర వాహనంపై నిందితులు ఎత్తుకెళ్లారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ, సాంకేతికత ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. బాలికను ఎత్తుకెళ్లిన దంపతులు జావిడ్ పాషా,అతని భార్యను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు ఇద్దరు ఉప్పల్లో వుండే పర్వీన్కు 1.30లక్షలకు అమ్మేసినట్లుగా తెలిసింది.
వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులు ఉప్పల్ చేరుకునే లోపు పర్వీన్ బేగం బాలికను సునీత రాజేంద్ర ప్రసాద్కు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా రెడ్ హ్యాండ్గా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని పాపను రక్షించి బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ,1ఆటో,1కార్,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
"ఏప్రిల్ 20 న చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు అం దింది. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఆధారంగా ఇద్దరిని నిందితులను జావేద్ బాషా అతడి భార్యను గుర్తించడం జరిగింది. నిందితులు కిడ్నాప్ చేసిన బాలికను ఉప్పల్లో ఉండే పర్వీన్ బాను అనే ఆమెకు 1.30 లక్షలకు అమ్మినట్లుగా పోలీసుల విచారణలో నిందితులు చెప్పారు. బాలికను వేరొకరికి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా కాపాడటం జరిగింది" -కాంతి లాల్ పాటిల్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ
అమ్మకు యాక్సిడెంట్ అని చెప్పి బాలిక కిడ్నాప్ - కాకపోతే మధ్యలో సీన్ రివర్సైంది
అబిడ్స్లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం - 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకున్న పోలీసులు - Abids Girl Kidnapped Case Update