ETV Bharat / state

అమరావతి ORR అప్డేట్స్ - 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ - AMARAVATI ORR LAND ACQUISITION

అమరావతి ఓఆర్ఆర్​కు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం - అలైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం

Amaravati ORR Updates
Amaravati ORR Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 2, 2025 at 7:34 AM IST

2 Min Read

Amaravati ORR Updates : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా అమరావతి ఓఆర్ఆర్​ను విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. ఓఆర్ఆర్​కు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించేందుకూ అంగీకరించింది.

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓఆర్‌ఆర్‌ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్‌ నిర్మాణమూ జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలపింది. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వేలైన్, ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది.

ORR Land Acquisition in Amaravati : దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు.

ఇటీవల అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు అనుమతిచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతంవైపు మాత్రమే సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌కు బయటివైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైనా సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు. ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉంటేనే ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందినవారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు. గడ్కరీ దానికి సమ్మతించారు.

అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు రూ.16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరుగనుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్​హెచ్ఐ వర్గాలు తెలిపాయి.

దారులన్నీ అమరావతికే! - ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం

189 కిలోమీటర్లు, ఆరు వరుసలతో అమరావతి ORR - కేంద్ర కమిటీ ఆమోదం

Amaravati ORR Updates : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా అమరావతి ఓఆర్ఆర్​ను విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. ఓఆర్ఆర్​కు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించేందుకూ అంగీకరించింది.

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓఆర్‌ఆర్‌ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్‌ నిర్మాణమూ జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలపింది. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వేలైన్, ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది.

ORR Land Acquisition in Amaravati : దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు.

ఇటీవల అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు అనుమతిచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతంవైపు మాత్రమే సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌కు బయటివైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైనా సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు. ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉంటేనే ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందినవారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు. గడ్కరీ దానికి సమ్మతించారు.

అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు రూ.16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరుగనుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్​హెచ్ఐ వర్గాలు తెలిపాయి.

దారులన్నీ అమరావతికే! - ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం

189 కిలోమీటర్లు, ఆరు వరుసలతో అమరావతి ORR - కేంద్ర కమిటీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.