Elevator Accident in Hyderabad : హైదరాబాద్లోని అపార్ట్మెంట్లలో నాసిరకం లిఫ్ట్లు ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సంతోష్నగర్ కాలనీలో ముజ్తాబా అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శామ్ బహదూర్ నేపాల్ నుంచి వచ్చి నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్నగదిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తన కుమారుడు సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపుల మధ్యకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 10 నిమిషాల తర్వాత సురేందర్ ఎక్కడున్నాడని వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని చిన్నారి రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్నాడు.
వెంటనే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. వీరు
నేపాల్ నుంచి వచ్చి జీవనోపాధి : వీరు నేపాల్ నుంచి జీవనోపాధి నిమిత్తం 7 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చారు. తొలుత గుడిమల్కాపూర్లో నిర్మాణంలో ఉన్న భవనానికి కాపలాదారుగా పని చేశారు. 3 నెలల క్రితం ప్రస్తుతం ఉంటున్న అపార్ట్మెంట్కు కాపలాదారుగా వచ్చాడు. నిర్వాహకులు గది ఇస్తామని చెప్పడంతో శామ్ బహదూర్ భార్య, కుమార్తె, కుమారుడిని నేపాల్ నుంచి తీసుకువచ్చాడు.
ప్రాణాలను చిదిమేస్తున్న లిఫ్ట్లు - అయినా పట్టించుకోరా?
లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న డోర్ - మూడో అంతస్తు నుంచి కిందపడి కమాండెంట్ మృతి
అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు - ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి