Group-1 Ranker Bhavya from Warangal : నీలో ఎంత ప్రతిభ ఉన్నా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తెనే ఉన్నతస్థాయికి చేరుకుంటాం. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకేదైనా, ఈ విషయాన్ని ముందే గుర్తించారు వరంగల్కు చెందిన భవ్య. తన భవితను మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు ప్లాన్ ప్రకారం చదువుకున్నారు. ఫలితంగా తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 521 మార్కులు సాధించి, 9వ ర్యాంకుతో తళుక్కున మెరిశారు. భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి హార్డ్వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలంటున్న భవ్యతో ఈటీవీ భారత్ చిట్చాట్.
యూపీఎస్సీ ప్రిపరేషన్తో సులభం : రెండేళ్ల నుంచి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యా. అదే నాకు టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో చాలా సులభంగా అయ్యింది. ర్యాంకు వస్తుందని ఆలోచించలేదు. కానీ పరీక్ష మాత్రం బాగా రాశాను అని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ఎక్జామ్ పేపర్పై ఏం చేయాలో అన్ని నేను ప్రాక్టిస్ చేశా. అది సఫలం అయినందుకు సంతోషంగా ఉంది.
"పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా ఓపిక సహనం ఉండాలి. అలా ఉంటేనే సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది. నేను అలానే 2023 నుంచి 2025 వరకు ప్రిపరేషన్లో ఉన్నా. అదే సమయంలో గ్రూప్-1 నోటిఫికేషన్ రావడంతో దానిని రాశాను. రోజూ 8 నుంచి 10 గంటలు చదవడం వల్ల ర్యాంకు సాధించగలిగాను" -భవ్య, గ్రూప్-1 ర్యాంకర్
మూడు సార్లు ప్రయత్నిద్దాం : హైదరాబాద్లో యూపీఎస్సీకి కోచింగ్ తీసుకున్నాను. అది గ్రూప్-1కి చాలా హెల్ప్ అయ్యింది. నాకు 521 మార్కులు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు వచ్చింది. మల్టీ జోన్-1లో 3వ ర్యాంకుగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ వస్తుందని అనుకుంటున్నాను. నేను మూడు అటెంప్ట్స్ ఇద్దామనుకున్నా. కుదరకపోతే ఆ తర్వాత వేరే ఇంకా చూద్దాం అనే ఆలోచన ఉండేది. అందుకే చాలా ధ్రుడ సంకల్పంతో ప్రయత్నించాను.
ఎమోషనల్గా పరీక్షను చూడొద్దు : చదవడం పోటీ పరీక్షల్లో ఒక వంతు అయితే. దానిని రాయడం మరో ఎత్తు. అందుకోసం ముందు నుంచే నేను టెస్ట్ సిరీస్ రాసి ప్రాక్టిస్ చేశాను. కొంత మంది పరీక్షల్లో మంచి ర్యాంకు రాకపోతే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వారు భావోద్వేగంతో పరీక్షను చూస్తారు. అలా చూడటం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కటే జీవితం కాదు.
గ్రూప్ 1, 2, 3, 4 ఫలితాల్లో ప్రతిభ - సూర్యాపేట యువకుడి సక్సెస్ మంత్ర ఇదే