ETV Bharat / state

డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌ - దీని వల్ల ఉపయోగాలు మీకు తెలుసా! - INNOVATIONS AT POST HARVEST CENTER

బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణలు - డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్, జీఐ కిట్‌, మిర్చిని బస్తాలోకి తొక్కేసే యంత్రం తయారు

Innovations_at_Post_Harvest_Center
Innovations_at_Post_Harvest_Center (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 25, 2025 at 11:42 AM IST

Updated : April 26, 2025 at 6:46 PM IST

4 Min Read

Bapatla Post Harvest Center Creates New Innovations : బాపట్ల జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష కిట్, ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాలను కనిపెట్టింది. పలు సమస్య నుంచి ఉపశమనం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవడం, శారీరక శ్రమకు బదులుగా యంత్రాల వినియోగించడం లాంటి వాటి కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ 3 ఆవిష్కరణలకు పేటెంట్‌ లభించింది.

తిన్నది నిదానంగా అరిగేలా : మనం తీసుకునే ఆహారం శరీరంలో పిండిపదార్థాల రూపంలో జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిని పెంచే కొలమానమే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ). జీఐ విలువ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. తెల్ల బియ్యంలో జీఐ విలువ ఎక్కువ. ఈ రైస్‌కుక్కర్‌ బియ్యాన్ని స్మార్ట్‌గా ఉడికించడం ద్వారా జీఐని తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్థులకే కాదు ఊబకాయాన్ని నివారించాలన్నా, జీవక్రియ రేటు నియంత్రణలో ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో జీఐ విలువ అత్యంత ప్రధానం. ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉండేలా ఈ స్మార్ట్‌కుక్కర్‌ను రూపొందించారు.

మొబైల్‌ యాప్‌తో కూడా నియంత్రణ : ప్రాసెసింగ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా అన్నంలోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్‌ స్మార్ట్‌ కుక్కర్‌ ప్రత్యేకత. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిదానంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. ఇంక శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. అన్నం వండే సమయంలో ఎక్కువ నీటిని వాడటం ద్వారా అదనపు గంజిని ఈ కుక్కర్‌ తీసివేస్తుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్లు కూడా తగ్గుతాయి.

అన్నాన్ని త్వరగా చల్లబరిచేలా చేసి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గిస్తుంది. ఈ స్మార్ట్‌ కుక్కర్‌లో ఐఓటీ కంట్రోల్స్‌ కూడా ఉన్నాయి. ఇంక ఈ కుక్కర్​ను మొబైల్‌ యాప్‌తో కూడా నియంత్రించవచ్చు. ఏఐతో కలిపి అల్గారిథం సమగ్రపరచడం ద్వారా రైస్‌ వేరియేటివ్, గంజి-అన్నం నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, ఆవిరి సమయాలను నియంత్రించేలా పలు మార్పులు చేయవచ్చు. త్వరలో ఈ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తామని శాస్త్రవేత్త సందీప్‌రాజా తెలిపారు.

వేళ్లు చూపిస్తే లైట్లు వెలుగుతాయ్ - ఏయూ విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష : మనం తీసుకునే ఆహారం ఎంత తొందరగా జీర్ణమై శరీరంలోని చక్కెర స్థాయిని ఏ మేరకు పెంచుతుందో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఖరీదైన వ్యవహారమే. ఇన్‌వైవ్‌ విధానం (ఆహారం తినిపించి పరీక్షించేది)లో చేసే పరీక్షకు పలు సంస్థలు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు తీసుకుంటున్నాయి. ఇన్విట్రో విధానం (ప్రయోగశాల)లో పరీక్షించే కిట్‌ను బాపట్ల పరిశోధన కేంద్రంలో తయారు చేశారు. ఇందులో పరీక్ష ఖర్చు రూ.7,500 మాత్రమే అవుతుంది. ఊబకాయం నియంత్రణ, నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవటానికి ఏం చేయాలనే అంశాలపై ప్రస్తుతం ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. వరి, అపరాలతో కూడిన పదార్థాల్లో జీఐ పరీక్ష చేయించుకోవటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇలాంటి వారికి ఈ పరీక్ష వరంగా మారుతుంది.

కాళ్లకు మంటలు లేకుండా: పొలంలో కోసిన మిర్చిని కళ్లంలో ఆరబెట్టాక గ్రేడింగ్‌ చేయించి గోతాల్లో తొక్కి మార్కెట్‌కు తరలిస్తారు. బస్తాల్లోకి ఒకరు కాయలు పోస్తుంటే మరొకరు లోపలకు దిగి కాళ్లతో తొక్కాలి. ఇలా చేయడం కూలీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎండుమిర్చిని గోతాల్లో నింపే యంత్రాన్ని పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీని కేంద్రం తయారుచేసింది. దీనికి పేటెంట్‌ కూడా లభించింది. తక్కువ సమయంలో ఎక్కువ టిక్కీలు నింపడంతోపాటు మిర్చి దెబ్బతినకుండా, విత్తనాలు రాలకుండా నింపేలా చేస్తుంది.

కూలీలు, యంత్రానికి గల వ్యత్సాసం ఇలా:

పనియంత్రం ద్వారాకూలీలతో తొక్కిస్తే
తొక్కడానికి పట్టే సమయం 3-3.5 నిమిషాలు 7-10 నిమిషాలు
గంటకు సామర్థ్యం20 గోతాలు 8 గోతాలు
టిక్కీ బరువు42 - 45 కిలోలు40-42 కిలోలు
కూలీలుఇద్దరు ఇద్దరు
ఒక టిక్కీకి ఖర్చురూ.10 రూ.30
యంత్రం ధరరూ.1.50 లక్షలు-----

మనం మామూలుగా వండిన అన్నం ఎలా అయితే ఉంటుందో అదే రుచి, రంగుతో అన్నం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న స్టాల్స్ ద్వారా అన్నంలో ఉన్న అనవసర వ్యర్థాలను బయటకు తీసేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇందులో వండటం వల్ల మనకు ఆహారం నిదానంగా జీర్ణం అవుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి లేనివారికి కచ్చితంగా ఉపయోగ పడుతుంది. - డీ. సందీప్ రాజా, స్మార్ట్ కుక్కర్ ఆవిష్క కర్త

ఈ రైస్ కుక్కర్​లో మనం అన్నం వండితే గ్లైసీమిక్స్ ఇండెక్సిని తగ్గించే విధంగా రూపకల్పన చేశారు. ముందుగా దీన్ని డవలప్ చేసనప్పుడు దీని పరిమాణం పెద్దగా ఉంది. దీన్ని ఇంకా రిఫైన్ చేసి ప్రతీ ఇంట్లోకి తీసుకెళ్లే విధంగా రూపకల్పనలు జరుగుతున్నాయి.- దుర్గాప్రసాద్, అసోసియోట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఎన్జీరంగా వర్శిటీ

స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌ - ఇవి వేసుకుంటే చాలు ఆరోగ్య సమస్యలు గుర్తించొచ్చు!

సూదిగుచ్చకుండానే "షుగర్" నిర్ధారణ - IISC శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ!

Bapatla Post Harvest Center Creates New Innovations : బాపట్ల జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష కిట్, ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాలను కనిపెట్టింది. పలు సమస్య నుంచి ఉపశమనం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవడం, శారీరక శ్రమకు బదులుగా యంత్రాల వినియోగించడం లాంటి వాటి కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ 3 ఆవిష్కరణలకు పేటెంట్‌ లభించింది.

తిన్నది నిదానంగా అరిగేలా : మనం తీసుకునే ఆహారం శరీరంలో పిండిపదార్థాల రూపంలో జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిని పెంచే కొలమానమే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ). జీఐ విలువ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. తెల్ల బియ్యంలో జీఐ విలువ ఎక్కువ. ఈ రైస్‌కుక్కర్‌ బియ్యాన్ని స్మార్ట్‌గా ఉడికించడం ద్వారా జీఐని తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్థులకే కాదు ఊబకాయాన్ని నివారించాలన్నా, జీవక్రియ రేటు నియంత్రణలో ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో జీఐ విలువ అత్యంత ప్రధానం. ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉండేలా ఈ స్మార్ట్‌కుక్కర్‌ను రూపొందించారు.

మొబైల్‌ యాప్‌తో కూడా నియంత్రణ : ప్రాసెసింగ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా అన్నంలోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ను తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్‌ స్మార్ట్‌ కుక్కర్‌ ప్రత్యేకత. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిదానంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. ఇంక శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. అన్నం వండే సమయంలో ఎక్కువ నీటిని వాడటం ద్వారా అదనపు గంజిని ఈ కుక్కర్‌ తీసివేస్తుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్లు కూడా తగ్గుతాయి.

అన్నాన్ని త్వరగా చల్లబరిచేలా చేసి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గిస్తుంది. ఈ స్మార్ట్‌ కుక్కర్‌లో ఐఓటీ కంట్రోల్స్‌ కూడా ఉన్నాయి. ఇంక ఈ కుక్కర్​ను మొబైల్‌ యాప్‌తో కూడా నియంత్రించవచ్చు. ఏఐతో కలిపి అల్గారిథం సమగ్రపరచడం ద్వారా రైస్‌ వేరియేటివ్, గంజి-అన్నం నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, ఆవిరి సమయాలను నియంత్రించేలా పలు మార్పులు చేయవచ్చు. త్వరలో ఈ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తామని శాస్త్రవేత్త సందీప్‌రాజా తెలిపారు.

వేళ్లు చూపిస్తే లైట్లు వెలుగుతాయ్ - ఏయూ విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష : మనం తీసుకునే ఆహారం ఎంత తొందరగా జీర్ణమై శరీరంలోని చక్కెర స్థాయిని ఏ మేరకు పెంచుతుందో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఖరీదైన వ్యవహారమే. ఇన్‌వైవ్‌ విధానం (ఆహారం తినిపించి పరీక్షించేది)లో చేసే పరీక్షకు పలు సంస్థలు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు తీసుకుంటున్నాయి. ఇన్విట్రో విధానం (ప్రయోగశాల)లో పరీక్షించే కిట్‌ను బాపట్ల పరిశోధన కేంద్రంలో తయారు చేశారు. ఇందులో పరీక్ష ఖర్చు రూ.7,500 మాత్రమే అవుతుంది. ఊబకాయం నియంత్రణ, నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవటానికి ఏం చేయాలనే అంశాలపై ప్రస్తుతం ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. వరి, అపరాలతో కూడిన పదార్థాల్లో జీఐ పరీక్ష చేయించుకోవటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇలాంటి వారికి ఈ పరీక్ష వరంగా మారుతుంది.

కాళ్లకు మంటలు లేకుండా: పొలంలో కోసిన మిర్చిని కళ్లంలో ఆరబెట్టాక గ్రేడింగ్‌ చేయించి గోతాల్లో తొక్కి మార్కెట్‌కు తరలిస్తారు. బస్తాల్లోకి ఒకరు కాయలు పోస్తుంటే మరొకరు లోపలకు దిగి కాళ్లతో తొక్కాలి. ఇలా చేయడం కూలీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎండుమిర్చిని గోతాల్లో నింపే యంత్రాన్ని పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీని కేంద్రం తయారుచేసింది. దీనికి పేటెంట్‌ కూడా లభించింది. తక్కువ సమయంలో ఎక్కువ టిక్కీలు నింపడంతోపాటు మిర్చి దెబ్బతినకుండా, విత్తనాలు రాలకుండా నింపేలా చేస్తుంది.

కూలీలు, యంత్రానికి గల వ్యత్సాసం ఇలా:

పనియంత్రం ద్వారాకూలీలతో తొక్కిస్తే
తొక్కడానికి పట్టే సమయం 3-3.5 నిమిషాలు 7-10 నిమిషాలు
గంటకు సామర్థ్యం20 గోతాలు 8 గోతాలు
టిక్కీ బరువు42 - 45 కిలోలు40-42 కిలోలు
కూలీలుఇద్దరు ఇద్దరు
ఒక టిక్కీకి ఖర్చురూ.10 రూ.30
యంత్రం ధరరూ.1.50 లక్షలు-----

మనం మామూలుగా వండిన అన్నం ఎలా అయితే ఉంటుందో అదే రుచి, రంగుతో అన్నం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న స్టాల్స్ ద్వారా అన్నంలో ఉన్న అనవసర వ్యర్థాలను బయటకు తీసేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇందులో వండటం వల్ల మనకు ఆహారం నిదానంగా జీర్ణం అవుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి లేనివారికి కచ్చితంగా ఉపయోగ పడుతుంది. - డీ. సందీప్ రాజా, స్మార్ట్ కుక్కర్ ఆవిష్క కర్త

ఈ రైస్ కుక్కర్​లో మనం అన్నం వండితే గ్లైసీమిక్స్ ఇండెక్సిని తగ్గించే విధంగా రూపకల్పన చేశారు. ముందుగా దీన్ని డవలప్ చేసనప్పుడు దీని పరిమాణం పెద్దగా ఉంది. దీన్ని ఇంకా రిఫైన్ చేసి ప్రతీ ఇంట్లోకి తీసుకెళ్లే విధంగా రూపకల్పనలు జరుగుతున్నాయి.- దుర్గాప్రసాద్, అసోసియోట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఎన్జీరంగా వర్శిటీ

స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌ - ఇవి వేసుకుంటే చాలు ఆరోగ్య సమస్యలు గుర్తించొచ్చు!

సూదిగుచ్చకుండానే "షుగర్" నిర్ధారణ - IISC శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ!

Last Updated : April 26, 2025 at 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.