ETV Bharat / state

ఓబుళాపురం మైనింగ్ కేసు - గాలి జనార్దన్​​ రెడ్డితో సహా నలుగురికి బెయిల్ - BAIL GRANTED TO ACCUSED IN OMC

ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురు నిందితులకు బెయిల్‌ - బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Bail Granted to Accused in Obulapuram Illegal Mining Case
Bail Granted to Accused in Obulapuram Illegal Mining Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 11, 2025 at 11:20 AM IST

1 Min Read

Obulapuram Illegal Mining Case Update : ఓబుళాపురం అక్రమ మైనింగ్​ కేసులో గాలి జనార్దన్​ రెడ్డి సహా ముగ్గురికి తెలంగాణ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. గాలి జనార్దన్​ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజ్​గోపాల్​కు బెయిల్​ ఇచ్చింది. ఈ కేసులో నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10లక్షల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది.

పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబుళాపురం మైనింగ్ కేసులు మే 6న నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ప్రధాన నిందితులై బి.వి.శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్​ రెడ్డి, వి.డి. రాజగోపాల్​, మెఫజ్ అలీఖాన్​లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమాన విధించింది. గవర్నమెంట్ ఉద్యోగి అయిన రాజగోపాల్​కు అదనంగా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పుతో వీరికి ఊరట లభించింది.

సీబీఐకి నోటీసులు : ఇదే కేసులో నిందితురాలైనా ఐఏఎస్​ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణను హైకోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్​ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

Obulapuram Illegal Mining Case Update : ఓబుళాపురం అక్రమ మైనింగ్​ కేసులో గాలి జనార్దన్​ రెడ్డి సహా ముగ్గురికి తెలంగాణ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. గాలి జనార్దన్​ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజ్​గోపాల్​కు బెయిల్​ ఇచ్చింది. ఈ కేసులో నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10లక్షల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది.

పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబుళాపురం మైనింగ్ కేసులు మే 6న నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ప్రధాన నిందితులై బి.వి.శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్​ రెడ్డి, వి.డి. రాజగోపాల్​, మెఫజ్ అలీఖాన్​లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమాన విధించింది. గవర్నమెంట్ ఉద్యోగి అయిన రాజగోపాల్​కు అదనంగా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పుతో వీరికి ఊరట లభించింది.

సీబీఐకి నోటీసులు : ఇదే కేసులో నిందితురాలైనా ఐఏఎస్​ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణను హైకోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్​ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

'ఎమ్మెల్యే బ్యాంకు లాకర్​లో 1.2 కిలోల బంగారు బిస్కెట్లు - 100కు పైగా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు' - MLA Gudem Mahipal Reddy bank locker

ఒకే కేసు - ఒకే రోజు - తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలిసారి ఇలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.