ETV Bharat / state

వృద్ధ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ రామ్ చందర్ సస్పెండ్ - ASI RAMCHANDAR SUSPENDED

నిర్మల్ జిల్లాలో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ - ఏఎస్ఐ సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల - రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హరీశ్​రావు డిమాండ్

ASI Ramchandar Suspended
ASI Ramchandar Suspended (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2025 at 6:47 PM IST

2 Min Read

ASI Ramchandar Suspended : భూభారతి సదస్సులో తన భూ సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధ రైతును ఓ పోలీసు అధికారి బయటకు గెంటేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకటి అనే వృద్ధుడు తనకున్న వ్యవసాయ భూమిలో అరెకరం భూమి ఇతరులకు పట్టా అయిందని తన సమస్యను తహసిల్దార్ సుజాతకు విన్నవించేందుకు కౌంటర్లను దాటుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో వారు రైతును బయటకు పంపాలని పోలీసులకు తెలిపారు.

అక్కడే ఉన్న ఏఎస్ఐ రామ్ చందర్ అక్కడికి చేరుకొని రైతుతో దురుసుగా ప్రవర్తించి బైటకు గెంటివేశాడు. ఈ ఘటన వివాదంగా మారింది. సోషల్ మీడియోలో వైరల్​గా మారిన వీడియో మంత్రి సీతక్క దృషికి వెళ్లింది. నిర్మల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీయడంతో దీనిపై విచారణ చేపట్టామని, ఏఎస్ఐ రాంచందర్​ను డీఐజీ సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

వృద్ధ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ రామ్ చందర్ సస్పెండ్ (ETV Bharat)

"భూభారతి సదస్సులో ఎమ్మార్వోతో రైతు ఆర్గుమెంట్ చేశారు. దీంతో రైతును బయటకు పంపించాలని పోలీసులకు చెప్పారు. రైతును బయటకు పంపించే క్రమంలో ఏఎస్​ఐ రామ్ చందర్ దురుసుగా నెట్టివేయడం జరిగింది.దీంతో ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగింది."- జానకి షర్మిల, నిర్మల జిల్లా ఎస్పీ

రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ : రైతు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజా పాలన ఇదేనా, సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారని, నేడు ఖానాపూర్​లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారని ఆక్షేపించారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు.

ASI Ramchandar Suspended : భూభారతి సదస్సులో తన భూ సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధ రైతును ఓ పోలీసు అధికారి బయటకు గెంటేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకటి అనే వృద్ధుడు తనకున్న వ్యవసాయ భూమిలో అరెకరం భూమి ఇతరులకు పట్టా అయిందని తన సమస్యను తహసిల్దార్ సుజాతకు విన్నవించేందుకు కౌంటర్లను దాటుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో వారు రైతును బయటకు పంపాలని పోలీసులకు తెలిపారు.

అక్కడే ఉన్న ఏఎస్ఐ రామ్ చందర్ అక్కడికి చేరుకొని రైతుతో దురుసుగా ప్రవర్తించి బైటకు గెంటివేశాడు. ఈ ఘటన వివాదంగా మారింది. సోషల్ మీడియోలో వైరల్​గా మారిన వీడియో మంత్రి సీతక్క దృషికి వెళ్లింది. నిర్మల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీయడంతో దీనిపై విచారణ చేపట్టామని, ఏఎస్ఐ రాంచందర్​ను డీఐజీ సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

వృద్ధ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ రామ్ చందర్ సస్పెండ్ (ETV Bharat)

"భూభారతి సదస్సులో ఎమ్మార్వోతో రైతు ఆర్గుమెంట్ చేశారు. దీంతో రైతును బయటకు పంపించాలని పోలీసులకు చెప్పారు. రైతును బయటకు పంపించే క్రమంలో ఏఎస్​ఐ రామ్ చందర్ దురుసుగా నెట్టివేయడం జరిగింది.దీంతో ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగింది."- జానకి షర్మిల, నిర్మల జిల్లా ఎస్పీ

రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ : రైతు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజా పాలన ఇదేనా, సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారని, నేడు ఖానాపూర్​లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారని ఆక్షేపించారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.