ETV Bharat / state

ఏపీలో భిన్న వాతావరణం - ఓ వైపు ఎండలు - మరోవైపు వర్షాలు - AP WEATHER ALERT

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు - రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఏపీఎస్‌డీఎంఏ

AP Weather Alert
AP Weather Alert (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 9:50 PM IST

2 Min Read

AP Weather Alert : ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దొర్నిపాడులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు : ఇవాళ అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 41.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40 డిగ్రీలు, తిరుపతి జిల్లా యాతలూరులో 40.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు.

ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా అరకులో 32.5 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 30.2 మిమీ, అన్నమయ్య జిల్లా నగరిమడుగులో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 21 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

శనివారం నాడు(19)న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే 73 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. విజయనగరం-10, పార్వతీపురం మన్యం-9,అల్లూరి సీతారామరాజు-1, కాకినాడ-2, తూర్పుగోదావరి-1, ఏలూరు-1, కృష్ణా-7, ఎన్టీఆర్-4, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు 20, ప్రకాశం-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Rain Alert in AP : మరోవైపు శనివారం నాడు (19)న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, రెండుమూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 20న (ఆదివారం) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.

రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో వర్షాలు - ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో!

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు - నేలకొరిగిన భారీ వృక్షాలు - తీవ్ర నష్టాల్లో అన్నదాతలు

AP Weather Alert : ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దొర్నిపాడులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు : ఇవాళ అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 41.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40 డిగ్రీలు, తిరుపతి జిల్లా యాతలూరులో 40.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు.

ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా అరకులో 32.5 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 30.2 మిమీ, అన్నమయ్య జిల్లా నగరిమడుగులో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 21 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

శనివారం నాడు(19)న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే 73 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. విజయనగరం-10, పార్వతీపురం మన్యం-9,అల్లూరి సీతారామరాజు-1, కాకినాడ-2, తూర్పుగోదావరి-1, ఏలూరు-1, కృష్ణా-7, ఎన్టీఆర్-4, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు 20, ప్రకాశం-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Rain Alert in AP : మరోవైపు శనివారం నాడు (19)న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, రెండుమూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 20న (ఆదివారం) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.

రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో వర్షాలు - ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో!

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు - నేలకొరిగిన భారీ వృక్షాలు - తీవ్ర నష్టాల్లో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.