AP Mega DSC Notification Schedule 2025 : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా మరో కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్పీ షెడ్యూలు ప్రకటించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగాడీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.
మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: నేడే మెగా డీఎస్సీ ప్రకటన వెలువడనుంది. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాద్యాయ పోస్టుల భర్తీకి మంత్రి నారా లోకేేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో అత్యధికంగా 1,817 ఎస్జీటీలు ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షల సిలబస్ తదితర వివరాలను నేడు వెల్లడించనున్నారు. పూర్తి వివరాలు https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in ఈ వెబ్సైట్లలో లభ్యం కానున్నాయి.
పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక 'కీ': ఆన్లైన్ ద్వారా పీజుల చెల్లింపు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక 'కీ' విడుదలవుతుంది. తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది 'కీ' విడుదల కానుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు. మెగా డీఎస్సీలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది.
వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు.
📢 A long-awaited dream is turning into reality. 🌟
— Lokesh Nara (@naralokesh) April 19, 2025
The Mega DSC Notification for 16,347 teacher posts will be released on April 20, 2025 at 10AM🗓️, fulfilling a key promise from our manifesto. ✅
This marks a historic leap forward in empowering schools and communities through…
ఆ పోస్టులకు పేపర్-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష: ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్-2 మార్కులు లెక్కిస్తారు.
ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వెయిటేజీ 20 శాతం ఉంటుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 19,192 ఖాళీల్లో ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచర్ పోస్టుల్లో సాంఘికశాస్త్రానికి 1,329, ఆంగ్ల భాషకు 1,032 పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1,664 భర్తీ చేయనున్నారు.
ఈటీవీ భారత్ తరఫున ఆల్ ది బెస్ట్: మెగా డీఎస్సీ షెడ్యూల్ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ కల సాకారం కానుంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగాడీఎస్సీ నోటిఫికేషన్ నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగును సూచిస్తుంది. ఓర్పు, పట్టుదలతో ఎదురుచూసిన ప్రతి ఔత్సాహికుడికి మీ క్షణం వచ్చేసింది. అందరికీ ఈటీవీ భారత్ తరఫున ఆల్ ది బెస్ట్.
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్ - వయోపరిమితి పెంపు
మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయండి - అధికారులకు సూచించిన మంత్రి లోకేశ్