AP INTERMEDIATE RESULTS: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
ఎలా చూడాలి అంటే?: ఇంటర్ ఫలితాలను resultsbie.ap.gov.inలో చూడవచ్చు. లేదంటే ఎంతో సింపుల్గా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్లోనే రెండే రెండు నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

- ముందుగా మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేయాలి.
- తరువాత మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
- అందులో మనకు కావలసిన విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- అందులో ఇంటర్మీడియట్ ఫలితాలు అనే కాలమ్ ఉంటుంది.
- దానిని సెలక్ట్ చేసుకుని, నిర్ధారించండి అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అనంతరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫలితాలు వస్తాయి.
🚨 Intermediate Results Update:🚨
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
Kindly note that the results for the Intermediate Public Examination (IPE) 2025 for 1st and 2nd-year students will be available on 12th April, 2025 from 11 AM onwards!
Students can check their results online at https://t.co/UDtk11bzit.…
పీడీఎఫ్ రూపంలో మార్కులు!: ఇంటర్మీయట్ పరీక్షలు అయిన తరువాత నుంచి వీలైనంత వేగంగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఏప్రిల్ 6 నాటికే మూల్యాంకనం పూర్తైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ పూర్తి చేశారు. దీనికి ఐదారు రోజులు సమయం పట్టింది. ఈ సారి వాట్సప్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను PDF రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే విద్యార్థులకు షార్ట్ మెమోలుగానూ ఉపయోగపడనున్నాయి. గతంలో ముందుగా ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఉంచేవారు. అయితే ఈసారి వాట్సప్లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేటు కాలేజీలకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 1 నుంచే తరగతులు ప్రారంభించారు.