ETV Bharat / state

మే 12 నుంచి ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ - INTER ADVANCED SUPPLEMENTARY

మే 12 నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు - నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు

Inter_Advanced_Supplementary
Inter_Advanced_Supplementary (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 12, 2025 at 11:19 PM IST

2 Min Read

AP Inter Advanced Supplementary from May 12: మే 12 నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 28 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష జూన్‌ 4న, పర్యావరణ విద్య జూన్‌ 6న నిర్వహించనున్నారు.

Inter_Advanced_Supplementary
మే 12 నుంచి ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (ETV Bharat)

INTERMEDIATE RESULTS: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ resultsbie.ap.gov.in ​లో చూసుకోవచ్చు. లేదంటే వాట్సప్​ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు నిమిషాల్లోనే PDF రూపంలో ఫలితాలు వస్తున్నాయి.

ఈ ఏడాది ఇంటర్మీడియ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం, హడావుడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు.

అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు: ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు.

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం - 7 నుంచే తరగతులు

విద్యార్థులకు గుడ్​న్యూస్​ - ఇంటర్మీడియట్​లో సీబీఎస్​ఈ సిలబస్​

AP Inter Advanced Supplementary from May 12: మే 12 నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 28 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష జూన్‌ 4న, పర్యావరణ విద్య జూన్‌ 6న నిర్వహించనున్నారు.

Inter_Advanced_Supplementary
మే 12 నుంచి ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (ETV Bharat)

INTERMEDIATE RESULTS: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ resultsbie.ap.gov.in ​లో చూసుకోవచ్చు. లేదంటే వాట్సప్​ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు నిమిషాల్లోనే PDF రూపంలో ఫలితాలు వస్తున్నాయి.

ఈ ఏడాది ఇంటర్మీడియ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం, హడావుడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు.

అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు: ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు.

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం - 7 నుంచే తరగతులు

విద్యార్థులకు గుడ్​న్యూస్​ - ఇంటర్మీడియట్​లో సీబీఎస్​ఈ సిలబస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.