New Policy for Distribution of Text Books in AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో సౌకర్యాల కల్పనతోపాటు మెరుగైన విద్య, పాఠ్య పుస్తకాలు, ఇతర సామగ్రి అందించడంలో కొత్త విధానం తీసుకొచ్చింది. జూన్ 12న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కమిటీల ఏర్పాటు: మండల స్థాయిలో కమిటీకి ఎంఈఓ-2 అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎంఈఓ-1, మండల ఇంజినీరు, ఎంఐఎస్ సమన్వయకర్త / డేటా ఎంట్రీ ఆపరేటర్, సీఎంఆర్టీతో సహా మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. కిట్లను మండల స్టాక్ పాయింట్కు చేర్చడం, సరిచూసి రసీదులు అందజేయడం, యాప్లో అప్లోడ్ చేయడం, పాఠశాలకు చేర్చడం, పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, రికార్డుల నిర్వహణ బాధ్యతలు వీరు చూడాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో కమిటీకి ప్రధానోపాధ్యాయుడు, గ్రామ విద్యా సహాయకుడు, మహిళా పోలీస్, పేరెంట్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు.
జిల్లా స్థాయిలో సమగ్రశిక్షా ఏపీసీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సీఎంవో కన్వీనర్గా, జీసీడీవో, ఎంఐఎస్ సమన్వయకర్త, ఏఎల్ఎస్సీవోలు సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరంతా జిల్లా కేంద్రంలో, మండల స్థాయిలో స్టాక్ పాయింట్లను గుర్తించి పర్యవేక్షణ, దస్త్రాల నిర్వహణ చేయడంతోపాటు రోజువారీ నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతారు.
సకాలంలో అందిస్తాం: విద్యార్థులకు కమిటీల ద్వారా సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. పాఠశాలలు తెరిచేనాటికి అన్నిరకాల పుస్తకాలు, సామగ్రి అందిస్తామని అన్నారు.
కిట్లో ఏముంటాయంటే: విద్యార్థి మిత్ర కిట్లో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్బుక్స్, నిఘంటువులు (Dictionaries), ఏకరూప దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయి.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు | 2,551 |
ప్రాథమికోన్నత | 91 |
ఉన్నత | 271 |
విద్యార్థులు | 1,69,175 |
ప్రతిపాదించిన పాఠ్యపుస్తకాలు | 25,50,151 |
బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే కోర్సులు చేయొచ్చు?