ETV Bharat / state

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు - విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు - GUIDELINES FOR RELEASE OF PRISONERS

సత్ప్రవర్తన గల ఖైదీల విడుదల చేసేందుకు మార్గదర్శకాలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం - ఉత్తర్వులు జారీ

Guidelines_for_Release_of_Prisoners
Guidelines_for_Release_of_Prisoners (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 2:41 PM IST

1 Min Read

Guidelines Finalized for Release of Well Behaved Prisoners: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపునిచ్చి ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. అర్హులైన, సత్ప్రవర్తన ఉన్న ఖైదీల వివరాలతో జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, సీఐడీ ప్రధాన న్యాయ సలహాదారు, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఆ జాబితాల్ని సమీక్షిస్తుంది.

ప్రతి ఖైదీకి సంబంధించిన కేసుల వివరాల్ని పరిశీలించి అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది. ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబరు 1వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై నిర్ణయం వెలువరుస్తుంది. ముందుస్తు విడుదలకు అర్హత పొందిన ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. విడుదల తర్వాత ఏదైనా నేరానికి పాల్పడినా, అరెస్టయినా క్షమాభిక్ష రద్దవుతుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Guidelines Finalized for Release of Well Behaved Prisoners: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపునిచ్చి ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. అర్హులైన, సత్ప్రవర్తన ఉన్న ఖైదీల వివరాలతో జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, సీఐడీ ప్రధాన న్యాయ సలహాదారు, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఆ జాబితాల్ని సమీక్షిస్తుంది.

ప్రతి ఖైదీకి సంబంధించిన కేసుల వివరాల్ని పరిశీలించి అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది. ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబరు 1వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై నిర్ణయం వెలువరుస్తుంది. ముందుస్తు విడుదలకు అర్హత పొందిన ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. విడుదల తర్వాత ఏదైనా నేరానికి పాల్పడినా, అరెస్టయినా క్షమాభిక్ష రద్దవుతుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

'రాజమండ్రి జైళ్లో రహస్యం' - ఉన్నతాధికారి చిత్రహింసతో జీవితఖైదీ ఆస్పత్రి పాలు!

నాడు ప్రియుడితో భర్తను కడతేర్చి - నేడు ఉరివేసుకొని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.