Actress Sri Reddy at Police Station : విజయనగరంజిల్లా పూసపాటిరేగ పోలీసుస్టేషన్కు నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. లోకేశ్, పవన్ కల్యాణ్పై అసభ్యకర పోస్టులు పెట్టారని, గతేడాది నవంబర్ 13న శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు అందింది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణకు నేడు శ్రీరెడ్డి హాజరైంది. ఈ మేరకు శ్రీరెడ్డిని సీఐ రామకృష్ణ విచారించి, 41నోటీసు ఇచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి తెలియచేశారు.
CASES ON SRI REDDY : సినీ నటి శ్రీరెడ్డిపై గతంలోనే కృష్ణా జిల్లా గుడివాడ పోలీసు స్టేషన్లో మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.
విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనూ శ్రీరెడ్డి మీద గతంలోనే కేసు నమోదైంది. శ్రీ రెడ్డిపై విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు అనుచితంగా వాఖ్యలు చేస్తూ, యూట్యూబ్లో వీడియో చేసిన శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
'మా' గొడవలోకి శ్రీరెడ్డి.. ఆ ప్యానల్పై తీవ్ర విమర్శలు
రాష్ట్రవ్యాప్తంగా పోసాని, శ్రీరెడ్డిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు