A Man Missing in Hyderabad : హైదరాబాద్లో అదృశ్యమైన వ్యక్తిని జమ్మూ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం నేలటూరుకు చెందిన వెంకటరావు కుటుంబం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఉంటోంది. ఈ క్రమంలో 3 నెలల క్రితం వెంకటరావు(50) అదృశ్యమయ్యాడు. మార్చి 31వ తేదీన జమ్మూలోని ఇంటర్నేషనల్ బోర్డర్ అఖ్నూర్ సెక్టార్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెంకటరావును బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబసభ్యులకు సమాచారం : వెంకటరావును జవాన్లు వివరాలు అడిగినప్పటికీ చెప్పలేకపోయాడు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వివరాలు సేకరించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈనెల 11న జమ్మూ వెళ్లిన అతడి కుమారుడు శ్రీనుకు బీఎస్ఎఫ్ పోలీసులు వెంకటరావును అప్పగించారు. తండ్రిని తీసుకొని ఆదివారం (ఏప్రిల్ 13) ఇంటికి చేరిన శ్రీను మాట్లాడుతూ 3 నెలలుగా తండ్రి కోసం వెతికామని, అంతదూరం ఆయన ఎలా వెళ్లారనేది ఇప్పటికీ తెలియడం లేదన్నారు.
సికింద్రాబాద్లో మిస్సింగ్ కలకలం - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు!
భార్య మిస్సింగ్ - కంటి చూపు మందగించి భర్తకు ఆపరేషన్! కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్లో!