900 Car Engines Theft at Kia Factory in SathyaSai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.
కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా? కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశముంది.
మంత్రి సత్యకుమార్ అనుచరుడి రౌడీయిజం - రాడ్లు, కర్రలతో దాడి చేసి భూకబ్జాకు యత్నం
పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నాం - 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం: నారా లోకేశ్