ETV Bharat / sports

శ్రేయస్​ అయ్యర్​పై విరాట్​ కోహ్లీ రివెంజ్​! ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూశారా? - VIRAT KOHLI TEASES SHREYAS IYER

శ్రేయర్​ అయ్యర్​పై రివెంజ్​ తీర్చుకున్న విరాట్ కోహ్లీ! ఏం చేశాడో మీరే చూడండి!

Virat Kohli Teases  Shreyas Iyer
Virat Kohli Teases Shreyas Iyer (@Xpost)
author img

By ETV Bharat Sports Team

Published : April 21, 2025 at 10:06 AM IST

Updated : April 21, 2025 at 10:32 AM IST

2 Min Read

Virat Kohli Teases Shreyas Iyer : ఐపీఎల్​ 2025 రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ దాదాపు సగం పూర్తయింది. దీంతో ప్లే ఆఫ్స్​కు వెళ్లే టీమ్​లపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మ్యాచ్​లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్​ అయిపోయాక పంజాబ్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​పై బెంగళూరు స్టార్​ విరాట్​ కోహ్లీ రివెంజ్ తీర్చుకున్నాడు!.

నెహాల్​ వదేరా బ్యాటింగ్​లో బెంగళూరు బ్యాటర్​ జితేశ్​ శర్మ సిక్స్​ బాది మ్యాచ్​ను పూర్తి చేశాడు. అనంతరం విరాట్​ కోహ్లీ తన తోటి టీమ్​ఇండియా ప్లేయర్​, పంజాబ్​ సారథి శ్రేయస్​ అయ్యర్​ను సరదాగా టీజ్​ చేశాడు. కొన్ని ఫన్​ జెశ్చర్​లతో శ్రేయస్​ను ఆటపట్టించాడు. కింగ్ కోహ్లీ చేసిన ఈ విన్యాసాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సన్నివేశం అభిమానుల్లో ఆహ్లాదాన్ని నింపింది. ఇదే కాదు ఇంతకుముందు కూడా కోహ్లీ ఇలా ఫన్నీ విన్యాసాలు చేసి క్రికెట్​ ప్రేమికులకు వినోదాన్ని పంచాడు.

అయితే ఈ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. 53 బంతుల్లో135.19 స్ట్రైక్​ రేట్​తో 73 పరుగుల చేసిన నాటౌట్​గా నిలిచాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దేవ్​దత్​ పడిక్కల్‌ కూడా కోహ్లీకి తోడయ్యాడు. స్వల్ప స్కోరును కాపాడుకోవడానికి పంజాబ్‌ అద్భుతాలేమీ చేయలేదు. మొదటి ఓవర్లోనే సాల్ట్‌ను ఔట్‌ చేసినా ఆ జట్టుకు సంతోషించడానికేమీ లేకపోయింది. విరాట్, పడిక్కల్‌ బెంగళూ ఇన్నింగ్స్‌ను నడిపించారు.

చేజింగ్​లో దిట్ట అయిన విరాట్​ ముచ్చటైన షాట్లు బాదాడు అలరించాడు. యాన్సెన్‌ వేసిన ఓవర్లో రెండు బంతులను బౌండరీ దాటించాడు. మరోవైపు పడిక్కల్‌ మరింత ధాటిగా ఆడి ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు రాబట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 13వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. అయితే చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన విరాట్​ తడబడకుండా రజత్‌ పాటీదార్‌ (12), జితేశ్‌ శర్మ (11 నాటౌట్‌)తో కలిసి బెంగళూరును విజయ తీరాలకు చేర్చాడు. 43 బంతుల్లో హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదాడు.

దుమ్మురేపిన రోహిత్‌, సూర్య- చెన్నై చిత్తు- ముంబయికి హ్యాట్రిక్‌

పాకిస్థాన్​లోనూ మనదే హవా! PSL మ్యాచ్​ జరుగుతుండగా మొబైల్​లో IPL చూసిన ప్రేక్షకుడు!

Virat Kohli Teases Shreyas Iyer : ఐపీఎల్​ 2025 రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ దాదాపు సగం పూర్తయింది. దీంతో ప్లే ఆఫ్స్​కు వెళ్లే టీమ్​లపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మ్యాచ్​లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్​ అయిపోయాక పంజాబ్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​పై బెంగళూరు స్టార్​ విరాట్​ కోహ్లీ రివెంజ్ తీర్చుకున్నాడు!.

నెహాల్​ వదేరా బ్యాటింగ్​లో బెంగళూరు బ్యాటర్​ జితేశ్​ శర్మ సిక్స్​ బాది మ్యాచ్​ను పూర్తి చేశాడు. అనంతరం విరాట్​ కోహ్లీ తన తోటి టీమ్​ఇండియా ప్లేయర్​, పంజాబ్​ సారథి శ్రేయస్​ అయ్యర్​ను సరదాగా టీజ్​ చేశాడు. కొన్ని ఫన్​ జెశ్చర్​లతో శ్రేయస్​ను ఆటపట్టించాడు. కింగ్ కోహ్లీ చేసిన ఈ విన్యాసాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సన్నివేశం అభిమానుల్లో ఆహ్లాదాన్ని నింపింది. ఇదే కాదు ఇంతకుముందు కూడా కోహ్లీ ఇలా ఫన్నీ విన్యాసాలు చేసి క్రికెట్​ ప్రేమికులకు వినోదాన్ని పంచాడు.

అయితే ఈ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. 53 బంతుల్లో135.19 స్ట్రైక్​ రేట్​తో 73 పరుగుల చేసిన నాటౌట్​గా నిలిచాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దేవ్​దత్​ పడిక్కల్‌ కూడా కోహ్లీకి తోడయ్యాడు. స్వల్ప స్కోరును కాపాడుకోవడానికి పంజాబ్‌ అద్భుతాలేమీ చేయలేదు. మొదటి ఓవర్లోనే సాల్ట్‌ను ఔట్‌ చేసినా ఆ జట్టుకు సంతోషించడానికేమీ లేకపోయింది. విరాట్, పడిక్కల్‌ బెంగళూ ఇన్నింగ్స్‌ను నడిపించారు.

చేజింగ్​లో దిట్ట అయిన విరాట్​ ముచ్చటైన షాట్లు బాదాడు అలరించాడు. యాన్సెన్‌ వేసిన ఓవర్లో రెండు బంతులను బౌండరీ దాటించాడు. మరోవైపు పడిక్కల్‌ మరింత ధాటిగా ఆడి ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు రాబట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 13వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. అయితే చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన విరాట్​ తడబడకుండా రజత్‌ పాటీదార్‌ (12), జితేశ్‌ శర్మ (11 నాటౌట్‌)తో కలిసి బెంగళూరును విజయ తీరాలకు చేర్చాడు. 43 బంతుల్లో హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదాడు.

దుమ్మురేపిన రోహిత్‌, సూర్య- చెన్నై చిత్తు- ముంబయికి హ్యాట్రిక్‌

పాకిస్థాన్​లోనూ మనదే హవా! PSL మ్యాచ్​ జరుగుతుండగా మొబైల్​లో IPL చూసిన ప్రేక్షకుడు!

Last Updated : April 21, 2025 at 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.