ETV Bharat / sports

ధోనీ టీమ్​కు సుర్యవంశీ సపోర్ట్- అప్పుడు మనోడి ఏజ్ 6ఏళ్లే! - IPL 2025

ఆరేళ్ల వయసులో ధోనీ టీమ్​కు వైభవ్ సపోర్ట్- జెర్సీ ధరించి మరీ ఫొటోకు పోజ్!

Vaibhav Suryavanshi Dhoni
Vaibhav Suryavanshi Dhoni (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 29, 2025 at 5:12 PM IST

2 Min Read

Vaibhav Suryavanshi IPL : 2025 ఐపీఎల్​లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. సోమవారం గుజరాత్​తో మ్యాచ్​లో ఈ 14ఏళ్ల చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు వైభవ్. అయితే ఈ చిచ్చరపిడుగు ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోనీ జట్టుకు సపోర్ట్ చేశాడని మీకు తెలుసా? అవును తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు వైభవ్ ఐపీఎల్​లో ధోనీ జట్టుకు మద్దతిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోను లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2017లో అప్పటి ఐపీఎల్​ జట్లలో ఒకటైన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​కు ధోనీ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్​లో పుణె జట్టుకు వైభవ్ మద్దతు తెలిపాడు. ఆరేళ్ల వయసులో స్డేడియానికి వచ్చి పుణె జెర్సీ ధరించి మరీ ఆ జట్టుకు సపోర్ట్ చేశాడు. ఇదే ఫొటోను సంజీవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్​గా మారింది. మనోడు అప్పుట్లో ధోనీ అభిమాని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

'గత రాత్రి వైభవ్​ ఇన్నింగ్స్‌ చూసిన నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ ఉదయం 6 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2017లో అప్పటి మా జట్టు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ను సపోర్ట్ చేస్తున్న ఫొటో చూశాను. థాంక్స్​ వైభవ్. నీకు నా శుభాకాంక్షలు' అని గోయెంకా ఆ పోస్ట్​కు క్యాప్షన్‌ రాశారు.

కాగా, గత మ్యాచ్​లో వైభవ్ జైపుర్​లో చిన్నపాటి సునామీ సృష్టించాడు. 11 సిక్స్​లు, 7 ఫోర్లతో ఊచకోత కోశాడు. అతడి మెరుపు బ్యాటింగ్​ వల్ల 210 పరుగుల భారీ టార్గెట్​ను రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే వైభవ్ 14ఏళ్ల వయసులోనే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వైభవ్ ఇన్నింగ్స్​పై పలువురు మాజీలు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'నాకు భయం లేదు- బాల్​ను చూసి మాత్రమే ఆడతా' - సెంచరీపై వైభవ్​ ఫస్ట్ రియాక్షన్

సునామీ సృష్టించిన సూర్యవంశీ- 210 టార్గెట్ ఉఫ్- GT చిత్తు

Vaibhav Suryavanshi IPL : 2025 ఐపీఎల్​లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. సోమవారం గుజరాత్​తో మ్యాచ్​లో ఈ 14ఏళ్ల చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు వైభవ్. అయితే ఈ చిచ్చరపిడుగు ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోనీ జట్టుకు సపోర్ట్ చేశాడని మీకు తెలుసా? అవును తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు వైభవ్ ఐపీఎల్​లో ధోనీ జట్టుకు మద్దతిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోను లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2017లో అప్పటి ఐపీఎల్​ జట్లలో ఒకటైన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​కు ధోనీ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్​లో పుణె జట్టుకు వైభవ్ మద్దతు తెలిపాడు. ఆరేళ్ల వయసులో స్డేడియానికి వచ్చి పుణె జెర్సీ ధరించి మరీ ఆ జట్టుకు సపోర్ట్ చేశాడు. ఇదే ఫొటోను సంజీవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్​గా మారింది. మనోడు అప్పుట్లో ధోనీ అభిమాని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

'గత రాత్రి వైభవ్​ ఇన్నింగ్స్‌ చూసిన నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ ఉదయం 6 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2017లో అప్పటి మా జట్టు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ను సపోర్ట్ చేస్తున్న ఫొటో చూశాను. థాంక్స్​ వైభవ్. నీకు నా శుభాకాంక్షలు' అని గోయెంకా ఆ పోస్ట్​కు క్యాప్షన్‌ రాశారు.

కాగా, గత మ్యాచ్​లో వైభవ్ జైపుర్​లో చిన్నపాటి సునామీ సృష్టించాడు. 11 సిక్స్​లు, 7 ఫోర్లతో ఊచకోత కోశాడు. అతడి మెరుపు బ్యాటింగ్​ వల్ల 210 పరుగుల భారీ టార్గెట్​ను రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే వైభవ్ 14ఏళ్ల వయసులోనే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వైభవ్ ఇన్నింగ్స్​పై పలువురు మాజీలు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'నాకు భయం లేదు- బాల్​ను చూసి మాత్రమే ఆడతా' - సెంచరీపై వైభవ్​ ఫస్ట్ రియాక్షన్

సునామీ సృష్టించిన సూర్యవంశీ- 210 టార్గెట్ ఉఫ్- GT చిత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.