Vaibhav Suryavanshi IPL : 2025 ఐపీఎల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. సోమవారం గుజరాత్తో మ్యాచ్లో ఈ 14ఏళ్ల చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు వైభవ్. అయితే ఈ చిచ్చరపిడుగు ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోనీ జట్టుకు సపోర్ట్ చేశాడని మీకు తెలుసా? అవును తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు వైభవ్ ఐపీఎల్లో ధోనీ జట్టుకు మద్దతిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోను లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2017లో అప్పటి ఐపీఎల్ జట్లలో ఒకటైన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు ధోనీ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో పుణె జట్టుకు వైభవ్ మద్దతు తెలిపాడు. ఆరేళ్ల వయసులో స్డేడియానికి వచ్చి పుణె జెర్సీ ధరించి మరీ ఆ జట్టుకు సపోర్ట్ చేశాడు. ఇదే ఫొటోను సంజీవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్గా మారింది. మనోడు అప్పుట్లో ధోనీ అభిమాని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'గత రాత్రి వైభవ్ ఇన్నింగ్స్ చూసిన నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ ఉదయం 6 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2017లో అప్పటి మా జట్టు రైజింగ్ పుణె సూపర్జెయింట్ను సపోర్ట్ చేస్తున్న ఫొటో చూశాను. థాంక్స్ వైభవ్. నీకు నా శుభాకాంక్షలు' అని గోయెంకా ఆ పోస్ట్కు క్యాప్షన్ రాశారు.
Last night I watched in awe… this morning I came across this photo of 6-year-old Vaibhav Suryavanshi cheering for my then team, Rising Pune Supergiant, in 2017.
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 29, 2025
Thanks Vaibhav. Lots of good wishes and support. pic.twitter.com/hlS5ieiB4O
కాగా, గత మ్యాచ్లో వైభవ్ జైపుర్లో చిన్నపాటి సునామీ సృష్టించాడు. 11 సిక్స్లు, 7 ఫోర్లతో ఊచకోత కోశాడు. అతడి మెరుపు బ్యాటింగ్ వల్ల 210 పరుగుల భారీ టార్గెట్ను రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలోనే వైభవ్ 14ఏళ్ల వయసులోనే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వైభవ్ ఇన్నింగ్స్పై పలువురు మాజీలు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'నాకు భయం లేదు- బాల్ను చూసి మాత్రమే ఆడతా' - సెంచరీపై వైభవ్ ఫస్ట్ రియాక్షన్