Vaibhav Suryavanshi IPL Debut Record : టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) పేరిట ఉంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్, లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సుగా మలచడం గమనార్హం. బిహార్కు చెందిన ఈ కుర్రాడు గతేడాది మెగా వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికాడు. దిల్లీ క్యాపిటల్స్తో పోటీపడి మరీ అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు ఆటగాడిగానూ వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు
వైభవ్ సూర్యవంశీ (14 ఏళ్ల 23 రోజులు రాజస్థాన్ రాయల్స్, 2025)
ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు ఆర్సీబీ, 2019)
ముజీబుర్ రెహ్మన్ (17 ఏళ్ల 11 రోజులు పంజాబ్ కింగ్స్, 2018)
రియాన్ పరాగ్ (17 ఏళ్ల 152 రోజులు రాజస్థాన్ రాయల్స్, 2019)
ప్రదీప్ సాంగ్వాన్ (17 ఏళ్ల 179 రోజులు దిల్లీ డేర్డెవిల్స్, 2008)
సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 182 రోజులు.. ఆర్సీబీ, 2015)
వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 199 రోజులు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017)
రాహుల్ చాహర్ (17 ఏళ్ల 247 రోజులు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017)
అభిషేక్ శర్మ (17 ఏళ్ల 250 రోజులు దిల్లీ క్యాపిటల్స్, 2018)
ఇషాన్ కిషన్ (17 ఏళ్ల 262 రోజులు గుజరాత్ లయన్స్, 2017)
దిల్లీపై గుజరాత్ విజయం
అంతకుముందు ఐపీఎల్లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (97*; 54 బంతుల్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (36; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. షెర్పాన్ రూథర్ఫోర్డ్ (43; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా రాహుల్ తెవాతియా (11*; 3 బంతుల్లో) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఏడు మ్యాచ్ల్లో దిల్లీకిది ఇది రెండో ఓటమి. ఐపీఎల్లో గుజరాత్కు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిల్లీ బ్యాటర్లలందరూ సమష్టిగా రాణించడంతో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు అభిషేక్ పొరెల్ (18; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (28; 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్ (38; 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో అశుతోష్ శర్మ (37; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) విరుచుకుపడ్డాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (4/41) అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.