Raina On Ms Dhoni : 2025 ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొమ్మిదింట్లో ఏడు ఓటములతో సీఎస్కే దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే సీఎస్కే జట్టు కూర్పు, వేలంలో ఆటగాళ్ల కొనుగోలుపై ఆ టీమ్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెగా వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో సీఎస్కే చురుగ్గా వ్యవహరింలేదని రైనా వ్యాఖ్యానించాడు. అయితే ధోనీ ఎప్పుడు కూడా వేలంలో పాల్గొనేవాడు కాదని గుర్తు చేశాడు.
'కాశీ సర్కు అడ్మినిస్ట్రేషన్వలో 30ఏళ్లకు అనుభవం ఉంది. క్రికెట్ వ్యవహారాలు, ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేయాలి, గ్రూప్ను ఎలా నిర్వహించాలనే విషయాలపై రూపా మేడమ్కు పట్టు ఉంది. అయితే ఈసారి మాత్రం ఎంపిక సరైన విధంగా ఉన్నట్లు అనిపించలేదు. ఇదే అందరి అభిప్రాయం. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎందుకు జరిగిందని కొందరు అడుగుతారు. నిజాయతీగా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా వేలంలో పాల్గొనలేదు. ఆ చర్చల్లో భాగం కాలేదు. ఎప్పుడైనా సరే నేను రిటైన్ చేసుకున్న ప్లేయర్ల గురించే మాట్లాడేవాడిని. ధోనీ కూడా తన నిర్ణయం చెప్పేవాడు. కానీ వేలంలో ఎప్పుడూ భాగం కాలేదు'
'కోర్ గ్రూప్లోని సభ్యులే వేలంలో పాల్గొంటారు. వేలానికి ధోనీ హాజరుకాడు. ఓ నలుగైదుగురు పేర్లను మాత్రమే సూచిస్తాడు. ఎవరిని రిటైన్ చేసుకోవాలో చెబుతాడు. 43 ఏళ్ల వయసులో అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగిన ధోనీ కష్టపడితే మిగిలిన పది మంది ఏం చేస్తున్నారు? అందులో కొందరికి రూ.18 కోట్లు, రూ.17 కోట్లు, రూ.12 కోట్లు దక్కాయి. మేనేజ్మెంట్ నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కానీ, పదే పదే అదే తప్పులతో ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం' అని రైనా పేర్కొన్నాడు.
అలాగే ధోనీ ఉన్నప్పటికీ మిగిలిన ఆటగాళ్లు రాణిస్తేనే గెలవడం సాధ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో చెన్నై ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడగా, కేవలం రెండే విజయాలు నమోదు చేసింది. 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
ధోనీ సూపర్ రికార్డ్- ఎలైట్ లిస్ట్లో రోహిత్, విరాట్ సరసన
ఆ విషయంలో విరాట్ తొందరపడ్డాడు- అలా చేయకుండా ఉండాల్సింది!: రైనా