ETV Bharat / sports

రోహిత్ శర్మ 'గేమ్​ఛేంజర్'- డగౌట్​లో కూర్చొనే మ్యాచ్ తిప్పేసిన హిట్​మ్యాన్! - IPL 2025

మాస్టర్​మైండ్ రోహిత్ శర్మ- వాట్ ఎన్ ఐడియా హిట్​మ్యాన్!- 5 టైటిళ్లు ఊరికే రావు మరి

Rohit Sharma
Rohit Sharma (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 14, 2025 at 10:39 AM IST

2 Min Read

Rohit Sharma Captaincy : 'కంటెంట్ ఉన్నోడు డగౌట్​లో కూర్చున్నా సరే, మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు' అనే డైలాగ్ రోహిత్ శర్మకు సరిగ్గా సెట్ అవుతుందేమో! ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో సరిగ్గా ఇదే జరిగింది. విజయం దిశగా దూసుకుపోతున్న దిల్లీకి, మాస్టర్​మైండ్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ అనుభవంతో డగౌట్​లో కూర్చొనే చెక్ పెట్టాడు. ఫలితంగా మ్యాచ్ ముంబయివైపు తిరిగింది.

206 పరుగులు లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగానే ఆరంభించింది. ఇక చివరి 30 బంతుల్లో విజయానికి 48 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ ఉన్నారు. ఈ దశలో దిల్లీ ఈజీగా గెలిచేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. డగౌట్​లో కూర్చొని ఉన్న రోహిత్ కోచ్​ జయవర్దనే, పరాస్ మాంబ్రేతో మాట్లాడి లెగ్ స్పిన్నర్​తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టవచ్చని సలహా ఇచ్చాడు . వెంటనే ఆ ఓవర్​ కర్ణ్ శర్మతోనే చేయించాలని అక్కడి నుంచే కెప్టెన్ హార్దిక్​కు సైగ చేశాడు.

16వ ఓవర్లో బంతి అందుకున్న కర్ణ్ తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్సే ఇచ్చాడు. ఇక మూడో బంతిని టాస్ వేయగా క్రీజులో ఉన్న రాహుల్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంచి బ్యాట్ అంచున తాకి అమాంతం అక్కడే గాల్లోకి లేచింది. చురుగ్గా స్పందించిన కర్ణ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతే మ్యాచ్ అక్కడే ముంబయి వైపు తిరిగింది. ఇక చివర్లో ముంబయి కళ్లు చెరిదే ఫీల్డింగ్​తో వరుస రనౌట్​లు చేసి దిల్లీని 193 పరుగులు ఆలౌట్ చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అలా మాజీ కెప్టెన్ రోహిత్ డగౌట్​లో కూర్చొనే మ్యాచ్​ ఫలితం మార్చేశాడు. పరాగ్ మాంబ్రే కూడా హిట్​మ్యాన్​ను మెచ్చుకున్నాడు. ఇక బౌలింగ్​లో మార్పులు సూచిస్తూ తనదైన మార్క్​ చూపించాడంటూ నెటిజన్లు హిట్​మ్యాన్​ను ప్రశంసిస్తున్నారు. 'రోహిత్ మాస్టర్​మైండ్', 'కెప్టెన్సీ నుంచి రోహిత్​ను తీసేసినా, నాయకుడి లక్షణాలు తీయలేరు', '5 టైటిళ్లు ఊరికే రాలేదు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఉత్కంఠ పోరులో ముంబయి గెలుపు- సీజన్​లో దిల్లీకి తొలి ఓటమి

ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​కు బిగ్ షాక్- లీగ్ నుంచి ఏడాది బ్యాన్!

Rohit Sharma Captaincy : 'కంటెంట్ ఉన్నోడు డగౌట్​లో కూర్చున్నా సరే, మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు' అనే డైలాగ్ రోహిత్ శర్మకు సరిగ్గా సెట్ అవుతుందేమో! ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో సరిగ్గా ఇదే జరిగింది. విజయం దిశగా దూసుకుపోతున్న దిల్లీకి, మాస్టర్​మైండ్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ అనుభవంతో డగౌట్​లో కూర్చొనే చెక్ పెట్టాడు. ఫలితంగా మ్యాచ్ ముంబయివైపు తిరిగింది.

206 పరుగులు లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగానే ఆరంభించింది. ఇక చివరి 30 బంతుల్లో విజయానికి 48 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ ఉన్నారు. ఈ దశలో దిల్లీ ఈజీగా గెలిచేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. డగౌట్​లో కూర్చొని ఉన్న రోహిత్ కోచ్​ జయవర్దనే, పరాస్ మాంబ్రేతో మాట్లాడి లెగ్ స్పిన్నర్​తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టవచ్చని సలహా ఇచ్చాడు . వెంటనే ఆ ఓవర్​ కర్ణ్ శర్మతోనే చేయించాలని అక్కడి నుంచే కెప్టెన్ హార్దిక్​కు సైగ చేశాడు.

16వ ఓవర్లో బంతి అందుకున్న కర్ణ్ తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్సే ఇచ్చాడు. ఇక మూడో బంతిని టాస్ వేయగా క్రీజులో ఉన్న రాహుల్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంచి బ్యాట్ అంచున తాకి అమాంతం అక్కడే గాల్లోకి లేచింది. చురుగ్గా స్పందించిన కర్ణ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతే మ్యాచ్ అక్కడే ముంబయి వైపు తిరిగింది. ఇక చివర్లో ముంబయి కళ్లు చెరిదే ఫీల్డింగ్​తో వరుస రనౌట్​లు చేసి దిల్లీని 193 పరుగులు ఆలౌట్ చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అలా మాజీ కెప్టెన్ రోహిత్ డగౌట్​లో కూర్చొనే మ్యాచ్​ ఫలితం మార్చేశాడు. పరాగ్ మాంబ్రే కూడా హిట్​మ్యాన్​ను మెచ్చుకున్నాడు. ఇక బౌలింగ్​లో మార్పులు సూచిస్తూ తనదైన మార్క్​ చూపించాడంటూ నెటిజన్లు హిట్​మ్యాన్​ను ప్రశంసిస్తున్నారు. 'రోహిత్ మాస్టర్​మైండ్', 'కెప్టెన్సీ నుంచి రోహిత్​ను తీసేసినా, నాయకుడి లక్షణాలు తీయలేరు', '5 టైటిళ్లు ఊరికే రాలేదు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఉత్కంఠ పోరులో ముంబయి గెలుపు- సీజన్​లో దిల్లీకి తొలి ఓటమి

ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​కు బిగ్ షాక్- లీగ్ నుంచి ఏడాది బ్యాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.