ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం- జైస్వాల్, జురెల్ పోరాటం వృథా - IPL 2025

ఆర్సీబీ ఆరో విజయం- పోరాడి ఓడిన రాజస్థాన్

RCB vs RR
RCB vs RR (Source : AP)
author img

By ETV Bharat Sports Team

Published : April 24, 2025 at 11:30 PM IST

2 Min Read

RCB vs RR IPL 2025 : 2025 ఐపీఎల్​లో ఆర్సీబీ ఆరో విజయం నమోదు చేసింది. గురువారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగులు ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 194-9 స్కోర్​కే పరిమితమైంది. జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) పోరాటం వృథా అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజెల్​వుడ్​కు 4, కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్, యశ్ దయాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. తాజా విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది.

భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (49; 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (47; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినప్పటికీ చివర్లో ఆ జట్టు బోల్తాపడింది. నితీశ్‌ రాణా (28), రియాన్ పరాగ్ (22; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (16), హెట్‌మయర్ (11) పరుగులు చేశారు.

చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్‌ లక్ష్యం 18 పరుగులు కాగా, హేజిల్‌వుడ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 205-5 స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (26) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (70 పరుగులు), దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించారు. సొంత గ్రౌండ్​లో విరాట్ ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయాడు. మరోవైపు పడిక్కల్ కూడా ధనాధన్ బ్యాటింగ్​లో అలరించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (23) రాణించిగా, జితేశ్ శర్మ (20, 10 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2, వానిందు హరసంగ, ఆర్చర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

RCB vs RR IPL 2025 : 2025 ఐపీఎల్​లో ఆర్సీబీ ఆరో విజయం నమోదు చేసింది. గురువారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగులు ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 194-9 స్కోర్​కే పరిమితమైంది. జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) పోరాటం వృథా అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజెల్​వుడ్​కు 4, కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్, యశ్ దయాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. తాజా విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది.

భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (49; 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (47; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినప్పటికీ చివర్లో ఆ జట్టు బోల్తాపడింది. నితీశ్‌ రాణా (28), రియాన్ పరాగ్ (22; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (16), హెట్‌మయర్ (11) పరుగులు చేశారు.

చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్‌ లక్ష్యం 18 పరుగులు కాగా, హేజిల్‌వుడ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 205-5 స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (26) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (70 పరుగులు), దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించారు. సొంత గ్రౌండ్​లో విరాట్ ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయాడు. మరోవైపు పడిక్కల్ కూడా ధనాధన్ బ్యాటింగ్​లో అలరించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (23) రాణించిగా, జితేశ్ శర్మ (20, 10 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2, వానిందు హరసంగ, ఆర్చర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.