Virat Kolhi About Partnerships : ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (51) అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే దిల్లీ నిర్దేశించిన 163 స్వల్ప టార్గెన్ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ- ఓ క్రమంలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య(73*) అద్భుత ప్రదర్శన చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ మెథడాలజీ గురించి కోహ్లీ వివరించాడు. పరిస్థితులను విశ్లేషించి, స్ట్రైక్ను రొటేట్ చేయడంపైనే తన దృష్టి ఉంటుందని చెప్పాడు. అయితే ప్రస్తుతం ప్రజలు పార్టనర్షిప్లకు ఉన్న ప్రాముఖ్యాన్ని మర్చిపోతున్నారని చెప్పాడు.
"ముఖ్యంగా సర్ఫేస్ను చూస్తే ఇది అత్యుత్తమ విజయం. మేము ఇక్కడ కొన్ని మ్యాచ్లను చూశాము. వాటితో పోలిస్తే ఈ వికెట్ భిన్నంగా ఉంది. ఛేజింగ్ చేసినప్పుడల్లా, మేము సరైన మార్గంలో ఉన్నామో లేదో అని నేను డగౌట్తో- చెక్ చేస్తూ ఉంటాను. ఆట స్తబ్దుగా ఉండకుండా చూసుకుంటాను. అందుకోసం సింగిల్స్, డబుల్స్ ఆగిపోకుండా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రజలు పార్టనర్షిప్ల ఇంపార్టెన్స్ను మరచిపోతున్నారు. ఈ టోర్నమెంట్లో ఫార్టనర్షిప్లు, ప్రొఫెషనలిజం ద్వారా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేలా ప్రయత్నించడానికి ఇది తెరపైకి వస్తుంది" అని విరాట్ కోహ్లీ వివరించాడు.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్య అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. 2016 నుంచి మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. "కృనాల్ అద్భుతంగా ఆడాడు. అతను ప్రభావం చూపగలడు అందుకు ఇది సరైన సమయం. మేము చాలా చక్కగా కమ్యూనికేట్ అయ్యాం. కృనాల్ తన అవకాశాలను ఉపయోగించుకునే వరకు వేచి ఉండమని నాకు చెబుతూనే ఉన్నాడు" అని కోహ్లీ తెలిపాడు.
దిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ను ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృనాల్ పాండ్య , విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ కేవలం 5 బంతుల్లో 19 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ముగించాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, చమీర 1 వికెట్ దక్కించుకున్నాడు.
దిల్లీపై ఆర్సీబీ రివెంజ్- హోం గ్రౌండ్లో విరాట్ షో
సారాతో డేటింగ్? మూడేళ్ల రిలేషన్షిప్పై తొలిసారి గిల్ రెస్పాన్స్