MI vs SRH IPL 2025 : 2025 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ విజయ పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబయి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. సన్రైజర్స్ నిర్దేశించిన 144 టార్గెట్ను ముంబయి 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (70) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (40) ఆకట్టుకున్నాడు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయికి రెండో ఓవర్లోనే దెబ్బ తగిలింది. రికెల్టన్ (11) ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన విల్ జాక్స్తో రోహిత్ శర్మ స్కోర్ బోర్డను పరులుగు పెట్టించాడు. జాక్స్ (22) ఔటైనా రోహిత్ జోరు తగ్గించలేదు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. సూర్యతో కలిసి రోహిత్ మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సన్రైజర్స్కు గొప్ప ఆరంభమేమీ లభించలేుదు. హెడ్ (0) డకౌట్ అవ్వగా, అభిషేక్ శర్మ (8) నిరాశ పర్చాడు. వన్ డౌన్లో ఇషాన్ కిషన్ (1), నితీశ్ రెడ్డి (2), అనికేత్ వర్మ (12) విఫలమయ్యారు. క్లాసెన్ (71 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో అభినవ్ మనోహర్ (43) రాణించాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లతో రాణించాడు. దీపక్ చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో 1 వికెట్ దక్కింది.