IPL 2025 RR VS LSG : ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయం అందుకుంది. సొంతగడ్డపై దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (97*; 54 బంతుల్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (36; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. షెర్పాన్ రూథర్ఫోర్డ్ (43; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. రాహుల్ తెవాతియా (11*; 3 బంతుల్లో) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఏడు మ్యాచ్ల్లో దిల్లీకిది ఇది రెండో ఓటమి. ఐపీఎల్లో గుజరాత్కు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిల్లీ.. బ్యాటర్లలందరూ సమష్టిగా రాణించడంతో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు అభిషేక్ పొరెల్ (18; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (28; 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్ (38; 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో అశుతోష్ శర్మ (37; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) విరుచుకుపడ్డాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (4/41) అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.