KKR vs PKBS IPL 2025 : 2025 ఐపీఎల్లో తొలిసారి మ్యాచ్ రద్దైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మేరకు మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ప్రస్తుతం 11 పాయింట్లతో పంజాబ్ నాలుగో ప్లేస్లో ఉండగా, కోల్కతా ఏడు పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.
పంజాబ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా ఒకే ఓవర్ బ్యాటింగ్ చేసింది. 1 ఓవర్ ముగిసేసరికి కోల్కతా 7 పరుగులు చేసింది. క్రీజులో గుర్బాజ్ (1), సునీల్ నరైన్ (4) ఉన్నాపు. అయితే తొలి ఓవర్లోనే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరజట్లకు చెరో పాయింట్ దక్కింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్సిమ్రన్ సింగ్ (83) హాఫ్ సెంచరీలతో రాణించారు. కోల్కతా బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
Match 4⃣4⃣ between @KKRiders and @PunjabKingsIPL has been called off due to rain 🌧️
— IndianPremierLeague (@IPL) April 26, 2025
Both teams share a point each! #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/mEX2eETWgh