ETV Bharat / sports

కోల్​కతా- పంజాబ్ మ్యాచ్ వర్షార్పణం- ఎవరు ఏ పొజిషన్​లో ఉన్నారంటే? - IPL 2025

కోల్​కతా- పంజాబ్ మ్యాచ్ రద్దు- ఇరు జట్లకు చెరో పాయింట్

KKR vs PKBS
KKR vs PKBS (Source : AP)
author img

By ETV Bharat Sports Team

Published : April 26, 2025 at 11:54 PM IST

1 Min Read

KKR vs PKBS IPL 2025 : 2025 ఐపీఎల్​లో తొలిసారి మ్యాచ్ రద్దైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్- పంజాబ్ కింగ్స్​ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మేరకు మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ప్రస్తుతం 11 పాయింట్లతో పంజాబ్ నాలుగో ప్లేస్​లో ఉండగా, కోల్​కతా ఏడు పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.

పంజాబ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్​కతా ఒకే ఓవర్ బ్యాటింగ్ చేసింది. 1 ఓవర్​ ముగిసేసరికి కోల్​కతా 7 పరుగులు చేసింది. క్రీజులో గుర్బాజ్ (1), సునీల్ నరైన్ (4) ఉన్నాపు. అయితే తొలి ఓవర్​లోనే మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడం వల్ల మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరజట్లకు చెరో పాయింట్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్​సిమ్రన్ సింగ్ (83) హాఫ్ సెంచరీలతో రాణించారు. కోల్​కతా బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

KKR vs PKBS IPL 2025 : 2025 ఐపీఎల్​లో తొలిసారి మ్యాచ్ రద్దైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్- పంజాబ్ కింగ్స్​ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మేరకు మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ప్రస్తుతం 11 పాయింట్లతో పంజాబ్ నాలుగో ప్లేస్​లో ఉండగా, కోల్​కతా ఏడు పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.

పంజాబ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్​కతా ఒకే ఓవర్ బ్యాటింగ్ చేసింది. 1 ఓవర్​ ముగిసేసరికి కోల్​కతా 7 పరుగులు చేసింది. క్రీజులో గుర్బాజ్ (1), సునీల్ నరైన్ (4) ఉన్నాపు. అయితే తొలి ఓవర్​లోనే మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడం వల్ల మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరజట్లకు చెరో పాయింట్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్​సిమ్రన్ సింగ్ (83) హాఫ్ సెంచరీలతో రాణించారు. కోల్​కతా బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.