Preity Zinta Court Case : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఈసారి టాప్- 2లోనూ నిలిచే ఛాన్స్ ఉంది. ఇంతలో ఆ జట్టులో గందరగోళం ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి, ఆ జట్టు డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై ఛండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇద్దరూ సమావేశం నిర్వహించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా ఈ ఇద్దరూ నిబంధనలకు విరుద్ధంగా గత నెల సమావేశం నిర్వహించి, మునీశ్ ఖన్నాను కొత్త డైరెక్టర్గా ఎన్నుకున్నారని, ఆ నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయకుండా చూడాలని పేర్కొన్నారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశం నిర్వహించారని ప్రీతి తన పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా, ప్రీతి ఈ ముగ్గురు KPH డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు ఈ కంపెనీకి చెందినదే. గతనెల 21న నిర్వహించిన సమావేశంలో ప్రీతితోపాటు మరో డైరెక్టర్ కరణ్ పాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కొత్త డైరెక్టర్గా మునీశ్ ఖన్నాను నియమించడాన్ని ప్రీతి వ్యవతిరేకించారు. ఈ క్రమంలోనే ఓనర్ల మధ్య వివాదం ముదిరింది. తాను ఈ మీటింగ్కు హాజరైనప్పటికీ ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేశారని, ఈ నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి కోర్టును కోరారు. కాగా, బోర్డులో వివాదాలు చెలరేగినప్పటికీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లకు డైరెక్టర్ ప్రీతి జింటా హాజరయ్యారు. జట్టుకు మద్దతుగా నిలుస్తూ ప్లేయర్లను ప్రోత్సహిస్తున్నారు.
🚨BREAKING: Preity Zinta moves court against Punjab Kings co-owners over disputed meeting.
— Manobala Vijayabalan (@ManobalaV) May 22, 2025
Punjab Kings co-owner and Bollywood actress Preity Zinta has filed a legal case against her fellow co-directors Mohit Burman and Ness Wadia in a Chandigarh court.
The three are directors… pic.twitter.com/UjDhhMLR98
ఇక ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన పంజాబ్, మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 24న జైపూర్లో దిల్లీ క్యాపిటల్స్తో, మే 26న ముంబయి ఇండియన్స్తో ఆడనుంది.
మయాంక్పై వేటు.. పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్గా శిఖర్ ధావన్