ETV Bharat / sports

ఉత్కంఠ మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం- ఇంగ్లాండ్​తో సిరీస్ సమం

భారత్- ఇంగ్లాండ్ ఐదో టెస్టు- హోరాహోరా మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం

England vs India
England vs India (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : August 4, 2025 at 4:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ind vs Eng 5th Test 2025 : లండన్ ఓవల్ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఐదో మ్యాచ్​లో నెగ్గాలంటే 35 పరుగులు కాపాడుకుంటూ, నాలుగు వికెట్లు పడగొట్టాల్సిన దశలో టీమ్ఇండియా అద్భుతంగా పోరాడింది. 339-6తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్​ను 367 పరుగులకే ఆలౌట్ చేసింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్​లో భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్​ల సిరీస్ 2-2తో సమం అయ్యింది.

339-6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్, మరో 28 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 స్కోర్​కే ఆలౌటైంది. ఐదో రోజు ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్లతో, 35 పరుగులు కావాల్సిన దశలో ఆట ప్రారంభించింది. ఈ దశలో టీమ్ఇండియా ఐదో రోజు తొలి ఓవర్​లోనే జెమీ స్మిత్ వికెట్ తీసింది. ఆ తర్వాత జెమ్మీ ఓవర్టన్, జోష్ టంగ్ వికెట్లు కూడా తొందరగానే కూల్చినా, గస్ అట్కిసన్ (29 బంతుల్లో 17 పరుగులు) పోరాడాడు.

మరోవైపు, గాయపడిన వోక్స్ బ్యాటింగ్​కు వచ్చాడు. ఈ దశలో అట్కిసన్ పోరాడాడు. వీలుచికినప్పుడల్లా పరుగులు సాధిస్తూ, టీమ్ఇండియా అభిమానుల్లో గబులు రేపాడు. కానీ, చివర్లో సిరాజ్ అద్భుత బంతికి అట్కిసన్​ను బౌల్డ్​ చేసి జట్టుకు విజయం ఖరారు చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ నెగ్గాగ, ఎడ్జ్​బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్​లో భారత్ విజయం సాధించింది. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది. నాలుగో మ్యాచ్​లో ఇంగ్లాండ్ మరోసారి భారత్​పై పైచేయి సాధించి నెగ్గింది. దీంతో నాలుగు టెస్టులు ముగిసేసరికి ఇంగ్లాండ్ 2-1తో లీడ్​లోకి వెళ్లింది. తాజాగా లండన్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్​లో టీమ్ఇండియా అద్భుతంగా పోరాడి 6 పరుగుల విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమం అయ్యింది.

గిల్ కెప్టెన్సీలో టై
టీమ్ఇండియా కొత్త కెప్టెన్​గా గిల్ ఈ సిరీస్​తో కొత్త శకాన్ని ప్రారంభించాడు. తన కెప్టెన్సీలో తొలి పర్యటను టై గా ముగించింది టీమ్ఇండియా. అటు గిల్ కెప్టెన్సీతోనే కాకుండా బ్యాటర్​గానూ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్​ల్లో కలిపి 754 పరుగులు బాది జట్టును ముందుండి నడిపించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

స్కోర్లు

  • భారత్- 224 & 396
  • ఇంగ్లాండ్- 247 & 367

బుమ్రా మ్యాటర్​లో ట్విస్ట్​- వర్క్​లోడ్ కాదు, వెళ్లిపోయింది అందుకే!

నాలుగో రోజు ముగిసిన ఆట- వీడని సస్పెన్స్- విజయం ఎవరిదో?