Sourav Ganguly On Pakistan : పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని భారత జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నాడు. పాకిస్థాన్తో అన్ని క్రికెట్ సంబంధాలను భారత్ తెంచుకోవాలని తేల్చి చెప్పాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని పేర్కొన్నాడు. ఈ అంశంలో భారత్ తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో అన్ని సంబంధాలు తెంచుకుంటంది భారత్. క్రీడల్లోనూ అదే పంథా కొనసాగుతోంది. ఇటీవల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పుడూ పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీసులను ఆడబోమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టంచేశారు.
చివరగా 2008లో టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్లింది. చివరిసారిగా 2012-13లో భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య ద్వైపాకిక్ష సిరీస్ జరిగింది. అప్పట్నుంచి కేవలం తటస్థ వేదికల్లోనే తలపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్తో క్రికెట్ ఆడొద్దనే డిమాండ్లు వస్తున్నాయి.
స్పందించని పాక్ క్రికెటర్లు
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించి ఆ దేశ తీరును ఎండగట్టాడు. అయితే అతడు మినహా పాకిస్థాన్ క్రికెటర్లు ఎవరూ స్పందించలేదు. గత ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మాత్రం భారత్పై అవాకులు చవాకులు పేల్చారు. టోర్నీనే బహిష్కరించాలంటూ పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడు మాత్రం కనీసం ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
పహల్గాంలో ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్లోని ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పాశవిక చర్య వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాక్కు గట్టి షాకిచ్చింది భారత్. ఇండస్ వాటర్ ట్రిటీ నిలిపివేతతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పాకిస్థాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
ధోనీ మ్యాజిక్, కమింద్ ఫ్రీహిట్ మిస్- కావ్య ఫ్రస్టేషన్ వీడియో వైరల్
ఆ విషయంతో ధోనీకి సంబంధం లేదు- ఆతడిని బ్లేమ్ చేయోద్దు! : రైనా