BCCI Warning to IPL Teams : ఇండియన్ ప్రీమియల్ లీగ్-ఐపీఎల్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్లో ఈ పొట్టి ఫార్మాట్ లీగ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది కొకసారి ఈ లీగ్ జరుగుతున్న సమయంలో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు దీని గురించే మాట్లాడుకుంటారు. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ను ఎంజాయ్ చేసేవారు ఉన్నట్లే, లీగ్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుంది. అప్పుడప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ సంచలన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఫిక్సింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బయటపడింది. దీంతో అప్రమత్తమైన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా- బీసీసీఐ, ఐపీఎల్లోని 10 ఫ్రాంచైజీలకు వార్నింగ్ నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్ బిజినెస్మ్యాన్
హైదరాబాద్కు చెందిన ఓ బిజినెస్మ్యాన్ జట్ల ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, కామెంటేటర్లనూ వదలకుండా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్- ACSUకి సమాచారం అందింది. పుంటెర్స్, బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. అతడు ఇప్పటికే పలు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని సమాచారం అందింది. అలాంటి వ్యక్తి ఐపీఎల్ టీమ్లతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎసీఎస్యూకు తెలిపింది. వ్యాపారవేత్తతో ఏవైనా సంభాషణలు జరిపితే తమకు నివేదించాలని ACSU కోరుంది. జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ భాగస్వాములకు సూచించింది.
ఖరీదైన గిఫ్ట్లతో బుట్టలో వేస్తాడు!
ఆ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్లు, ఆభరణాలతో బుట్టలో పడేస్తాడని ఏసీఎస్యూ తెలిపింది. కాగా, ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లకు, కోచ్లను కలిసి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్కు వెళ్తాడని తెలిసింది. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేటు పార్టీలకు కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ట్రాప్!
సదరు వ్యాపారవేత్త- ప్లేయర్లు, కోచ్లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎవరైన వ్యక్తి సంప్రదిస్తే- జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. ఇలాంటి ఆన్లైన్ కాంటాక్ట్స్ ఫిక్సింగ్కు దారితీసే అవకాశం ఉందని ACSU కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఐపీఎల్ వేళ బెట్టింగ్ దందాలు - ఒక్కసారి దిగారంటే ఊబిలో చిక్కుకుపోయినట్లే!
ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ - రూ. 43లక్షల సొమ్ము స్వాధీనం