Sundar Pichai Praises Vaibhav Suryavanshi : ఐపీఎల్లో అతిపిన్న వయసున్న ప్లేయర్గా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. శనివారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటిమి పాలైంది. అయితే ఆ జట్టు ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. 20 బంతుల్లో 34 పరుగులు చేసిన అతడి ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే సిక్స్ కొట్టాడు వైభవ్. రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటన చాలా మందిని బావోద్వేగానికి గురిచేసింది. అయితే అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ కూడా వైభవ్కు అభినందననలు తెలిపారు.
'అతడి ఆట చూడడానికే నిద్ర లేచా'
తాను ఈ 8వ తరగతి స్టూడెంట్ ఆటను చూసేందుకు నిద్ర లేచాను అని సుందర్ పిచాయ్ అన్నారు. ఐపీఎల్లో సూర్యవంశీ అద్భుతమైన అరంగేట్రం అని కొనియాడాడు.
Woke up to watch an 8th grader play in the IPL!!!! What a debut! https://t.co/KMR7TfnVmL
— Sundar Pichai (@sundarpichai) April 19, 2025
'కుర్ర యువరాజ్ గుర్తుకొచ్చాడు'
"14 ఏళ్ల కుర్రాడి ఆట సూపర్. అస్సలు ఊహించలేదు. మొదటి బంతిని ఎదుర్కొన్న అతడి బ్యాట్ దూకుడు చూడండి. కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్ను చూసినట్లు అనిపిస్తోంది" ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ అన్నాడు.
This is utterly absurd!!!!! 14! First ball 😂🤯😂
— Sam Billings (@sambillings) April 19, 2025
Look at that bat swing too, like prime Yuvi… wow 🤩 https://t.co/7mELxq4aQP
'ఫస్ట్బాల్ సిక్స్.. వావ్!'
"వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం బాగుంది. కవర్స్ మీదుగా ఫస్ట్ బాల్ను సిక్స్ బాదాడు. 14 ఏళ్ల అబ్బాయి- వావ్" అని డామియన్ ఫ్లెమింగ్ వైభవ్ను కొనియాడాడు.
'సూర్యవంశీ ఫ్యూచర్ సూపర్'
" ఫస్ట్ బాల్ నుంచే తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయి ఉండొచ్చు. సూర్యవంశీ మాత్రం ఆకట్టుకునే ఆటతీరు ఆడాడు. అతడికి మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తోంది" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజుల్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) పేరిట ఉంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్, లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు దిగాడు. బిహార్కు చెందిన ఈ కుర్రాడు గతేడాది మెగా వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికాడు. దిల్లీ క్యాపిటల్స్తో పోటీపడి మరీ అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు ఆటగాడిగానూ వైభవ్ రికార్డుకెక్కాడు.