MSD IPL Career : చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోనీ 43ఏళ్ల వయసులోనూ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది. ఇదే ఆఖరి సీజన్ అంటూ గత రెండేళ్లుగా ధోనీ ఐపీఎల్ కెరీర్పై ప్రచారం సాగుతోంది. కానీ, ఆ ప్రచారాలను కొట్టిపారేయడం, మళ్లీ కొత్త సీజన్లో ధోనీ బరిలోకి దిగడం మామూలు విషయమైంది. తాజాగా అతడి ఐపీఎల్ కెరీర్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్కు ధోనీ గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 2025 సీజన్ తర్వాత ఐపీఎల్కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని అన్నాడు. క్రికెట్కు, ఐపీఎల్కు ధోనీ ఒక ఐకాన్ లాంటివాడని చెప్పిన గిల్లీ, ఇందులో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.
'క్రికెట్లో ధోనీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్లో ఏం చెయ్యాలో అతడికి తెలుసు. కానీ, వచ్చే ఏడాది ధోనీ ఐపీఎల్ బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. ధోనీ నువ్వు ఓ ఛాంపియన్, వరల్డ్ క్రికెట్కు ఐకాన్లాంటివాడివి. లవ్ యూ' అని గిల్క్రిస్ట్ పంజాబ్తో మ్యాచ్ ముంగిట అన్నాడు.
ధోనీ మనసులో ఏముంది?
అయితే పలుమార్లు తన రిటైర్మెంట్ ప్రస్తావన రావడం వల్ల స్వయంగా ధోనీయే ఇటీవల దీనిపై స్పందించాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించేది లేదని అన్నాడు. 'ఇప్పటికిప్పుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించను. నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా. ఈ విషయంపై ఏడాదికి ఒకసారి ఆలోచిస్తా. ప్రస్తుతం నాకు 43ఏళ్లు. జులైలో నా ఏజ్ 44ఏళ్లు వస్తాయి. ఇంకా ఆడాలా? వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల టైమ్ ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు, నా శరీరం. సీజన్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తుందనిపిస్తే ఆడతా. 'ఇక చాలు' అని అనిపించేంతవరకు కొనసాగుతాను' అని ధోనీ క్లారిటీ ఇచ్చేశాడు.
కాగా, ప్రస్తుత సీజన్లో చెన్నై పలవంగా ఆడుతోంది. తొమ్మిదింట రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరగా ఉంది. దీంతో ప్లేఆఫ్స్ చేరడం దాదాపు కష్టమే!
ధోనీ టీమ్కు సుర్యవంశీ సపోర్ట్- అప్పుడు మనోడి ఏజ్ 6ఏళ్లే!
ఆ విషయంతో ధోనీకి సంబంధం లేదు- ఆతడిని బ్లేమ్ చేయొద్దు! : రైనా